PM Modi: మంగళవారం ప్రధాని మోడీ బర్త్ డే.. భారీ కార్యక్రమాలకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు
- మంగళవారం ప్రధాని మోడీ బర్త్ డే
- భారీ కార్యక్రమాలకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు
- దర్గా అజ్మీర్ షరీఫ్లో 4000 కిలోల శాఖాహారం పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన రోజు వేడుకలు ప్రత్యేకంగా జరిపేందుకు దేశ వ్యాప్తంగా పలు సంస్థలు, బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్గా అజ్మీర్ షరీఫ్లో 4000 కిలోల శాఖాహారం లంగర్ కూడా ఏర్పాటు చేశారు.
మోడీ ప్రస్థానమిదే..!
Also Read
- Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
- NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
- Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా 'హిమంత శర్మ' ప్రమాణ స్వీకారం..!
- Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి 'మాస్టర్ ప్లాన్'ను బట్టబయలు చేసిన షణ్ముగం!
ప్రధాని మోడీ… గుజరాత్లోని వాద్నగర్లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో తన తండ్రికి టీ అమ్మడంలో సహాయం చేశారు. అటు తర్వాత ఆర్ఎస్ఎస్ వాలంటీర్గా ప్రయాణం మొదలై.. గుజరాత్ ముఖ్యమంత్రి.. దేశ ప్రధానిగా సేవలందించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీలో పలు పదవులు అనుభవించారు. 2014లో ప్రధాని పదవికి మోడీ ప్రమాణస్వీకారం చేశారు.
మోడీ.. 17 ఏళ్ల వయసులో తన ఇంటిని వదిలి దేశమంతటా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. భారతదేశ పర్యటనలో హిమాలయాలలోని గరుడచట్టిలో బస చేసి, పశ్చిమ బెంగాల్లోని రామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈశాన్య ప్రాంతాలకు కూడా వెళ్లారు. ఈ యాత్రలు నరేంద్ర మోడీ జీవితంపై పెను ప్రభావం చూపాయి. మోడీ 2 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. రెండు వారాలు మాత్రమే ఉన్నారు. అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చేరడానికి ఇంటి నుంచి బయలుదేరారు. సంఘ్లో చేరేందుకు అహ్మదాబాద్ చేరుకున్నప్పుడు నరేంద్ర మోడీ వయసు కేవలం 20 ఏళ్లు.
1973 డిసెంబర్లో గుజరాత్లోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు… పెరిగిన మెస్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శన చేయడంతో అది ఉద్యమంగా మారి నవనిర్మాణ ఆందోళనగా మారింది. తర్వాత జేపీ కూడా ఈ ఉద్యమంలో చేరారు. ఈ ఉద్యమం ఇందిరా గాంధీ ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఇందిరా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు నరేంద్ర మోడీ దీనిని వ్యతిరేకించారు. ఎమర్జెన్సీ సమయంలో మోడీకి పలువురు నేతలు, కార్యకర్తలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది.
మోడీ 1988లో బీజేపీ గుజరాత్ యూనిట్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1990లో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అయోధ్య రథయాత్ర, 1991–92లో మురళీ మనోహర్ జోషి ఏక్తా యాత్ర నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. మోడీ బీజేపీ సంస్థలో క్రమంగా ఎదిగి గుర్తింపు పొందారు. దీని తర్వాత రాష్ట్రాల్లో పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉన్నారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని నరేంద్ర మోడీని బీజేపీ కోరింది. మోడీ 2014 వరకు ఈ పదవిలో కొనసాగారు. 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండగానే బీజేపీని గెలిపించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా నిలబెట్టినప్పుడు.. మోడీ దేశవ్యాప్తంగా పార్టీ మరియు ఎన్డీయే కోసం తీవ్రంగా ప్రచారం చేశారు. 2009 లోక్సభ ఎన్నికల్లో 116 సీట్లు గెలుచుకున్న బీజేపీ… 2014 లోక్సభ ఎన్నికల్లో 282 సీట్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014 నుంచి 2024 వరకు ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. అంటే మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా… మూడు సార్లు దేశ ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఈ రికార్డు మోడీకి మాత్రమే సొంతం.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram : ఘట్టమనేని వారసుడు జయకృష్ణపై భారీ అంచనాలు.. డాన్స్ అదరగొడుతున్నాడుగా
-
Udhayanidhi Stalin: అధికారం పోయినా మారని తీరు! సనాతన ధర్మంపై మరోసారి విషం చిమ్మిన ఉదయనిధి స్టాలిన్
-
NEET UG 2026 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
-
Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ‘హిమంత శర్మ’ ప్రమాణ స్వీకారం..!
-
RJ Balaji: ‘వీర భద్రుడు’ రిలీజ్కు ముందు కొత్త వివాదం.. ఆర్జే బాలాజీపై ఫ్యాన్స్ ఫైర్!
ట్రెండింగ్
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..