PM Modi: మంగళవారం ప్రధాని మోడీ బర్త్ డే.. భారీ కార్యక్రమాలకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు
- మంగళవారం ప్రధాని మోడీ బర్త్ డే
- భారీ కార్యక్రమాలకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు
- దర్గా అజ్మీర్ షరీఫ్లో 4000 కిలోల శాఖాహారం పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన రోజు వేడుకలు ప్రత్యేకంగా జరిపేందుకు దేశ వ్యాప్తంగా పలు సంస్థలు, బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్గా అజ్మీర్ షరీఫ్లో 4000 కిలోల శాఖాహారం లంగర్ కూడా ఏర్పాటు చేశారు.
మోడీ ప్రస్థానమిదే..!
Also Read
- Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
- BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
ప్రధాని మోడీ… గుజరాత్లోని వాద్నగర్లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో తన తండ్రికి టీ అమ్మడంలో సహాయం చేశారు. అటు తర్వాత ఆర్ఎస్ఎస్ వాలంటీర్గా ప్రయాణం మొదలై.. గుజరాత్ ముఖ్యమంత్రి.. దేశ ప్రధానిగా సేవలందించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీలో పలు పదవులు అనుభవించారు. 2014లో ప్రధాని పదవికి మోడీ ప్రమాణస్వీకారం చేశారు.
మోడీ.. 17 ఏళ్ల వయసులో తన ఇంటిని వదిలి దేశమంతటా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. భారతదేశ పర్యటనలో హిమాలయాలలోని గరుడచట్టిలో బస చేసి, పశ్చిమ బెంగాల్లోని రామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈశాన్య ప్రాంతాలకు కూడా వెళ్లారు. ఈ యాత్రలు నరేంద్ర మోడీ జీవితంపై పెను ప్రభావం చూపాయి. మోడీ 2 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. రెండు వారాలు మాత్రమే ఉన్నారు. అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చేరడానికి ఇంటి నుంచి బయలుదేరారు. సంఘ్లో చేరేందుకు అహ్మదాబాద్ చేరుకున్నప్పుడు నరేంద్ర మోడీ వయసు కేవలం 20 ఏళ్లు.
1973 డిసెంబర్లో గుజరాత్లోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు… పెరిగిన మెస్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శన చేయడంతో అది ఉద్యమంగా మారి నవనిర్మాణ ఆందోళనగా మారింది. తర్వాత జేపీ కూడా ఈ ఉద్యమంలో చేరారు. ఈ ఉద్యమం ఇందిరా గాంధీ ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఇందిరా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు నరేంద్ర మోడీ దీనిని వ్యతిరేకించారు. ఎమర్జెన్సీ సమయంలో మోడీకి పలువురు నేతలు, కార్యకర్తలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది.
మోడీ 1988లో బీజేపీ గుజరాత్ యూనిట్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1990లో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అయోధ్య రథయాత్ర, 1991–92లో మురళీ మనోహర్ జోషి ఏక్తా యాత్ర నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. మోడీ బీజేపీ సంస్థలో క్రమంగా ఎదిగి గుర్తింపు పొందారు. దీని తర్వాత రాష్ట్రాల్లో పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉన్నారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని నరేంద్ర మోడీని బీజేపీ కోరింది. మోడీ 2014 వరకు ఈ పదవిలో కొనసాగారు. 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండగానే బీజేపీని గెలిపించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా నిలబెట్టినప్పుడు.. మోడీ దేశవ్యాప్తంగా పార్టీ మరియు ఎన్డీయే కోసం తీవ్రంగా ప్రచారం చేశారు. 2009 లోక్సభ ఎన్నికల్లో 116 సీట్లు గెలుచుకున్న బీజేపీ… 2014 లోక్సభ ఎన్నికల్లో 282 సీట్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014 నుంచి 2024 వరకు ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. అంటే మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా… మూడు సార్లు దేశ ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఈ రికార్డు మోడీకి మాత్రమే సొంతం.
తాజావార్తలు
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!