Netanyahu: ప్రధాని మోడీతో మాట్లాడటానికి కీలక సమావేశాన్ని నిలిపేసిన నెతన్యాహూ..
- మోడీతో మాట్లాడేందుకు కీలక సమావేశాన్ని నిలిపేసిన నెతన్యాహూ..
- గాజా శాంతి ప్రణాళికపై అభినందనలు తెలిపిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netanyahu: రెండేళ్లుగా సాగుతున్న గాజా యుద్ధం ముగిసేందుకు మార్గం సుగమం అయింది. ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ఒప్పందం’’ కుదిరింది. గాజా శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చారు. ఈ నేపథ్యంలో, గురువారం ప్రధాని నరేంద్రమోడీ, ట్రంప్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు కూడా ప్రధాని మోడీ ఫోన్ చేశారు. అయతే, ఆ సమయంలో నెతన్యాహూ గాజా శాంతి ప్రణాళిక, కాల్పుల విరమణ, బందీల విడుదలపై భద్రతా కమిటీలో చర్చిస్తున్నారు. మోడీ ఫోన్ రావడంతో నెతన్యాహూ ఈ అత్యవసరం సమావేశాన్ని నిలిపేసినట్లు ఆయన కార్యాలయం చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది. ట్రంప్ 20- పాయింట్ల గాజా శాంతి ప్రణాళికపై ప్రధాని మోడీ ఇజ్రాయిల్ ప్రధానిని అభినందించారు. “బందీలందరినీ విడుదల చేయడానికి కుదిరిన ఒప్పందంపై ప్రధాని మోదీ ప్రధాని నెతన్యాహును అభినందించారు” అని నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
Read Also: Nobel Peace Prize 2025: పాపం ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చిందో తెలుసా!
ప్రధాని మోడీ, నెతన్యాహూతో మాట్లాడినట్లు ఎక్స్ ద్వారా చెప్పారు. “అధ్యక్షుడు ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక కింద సాధించిన పురోగతిపై అభినందించడానికి నా స్నేహితుడు ప్రధాన మంత్రి నెతన్యాహుకు ఫోన్ చేసాను. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాము. ప్రపంచంలో ఎక్కడైనా ఏ రూపంలోనైనా లేదా వ్యక్తీకరణలోనైనా ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పునరుద్ఘాటించాము’’ అని ట్వీట్ చేశారు.
ఇదే విషయాన్ని ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది. ‘‘ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడే భారత ప్రధాన మంత్రితో మాట్లాడారు. బందీలందరినీ విడుదల చేయడానికి సాధించిన ఒప్పందంపై నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి నెతన్యాహుకు తన అభినందనలు తెలిపారు’’ అని చెప్పింది.
తాజావార్తలు
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..