Nobel Peace Prize 2025: పాపం ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చిందో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobel Peace Prize 2025: ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడింది. ఈ అవార్డుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్కు నోబెల్ కమిటి నుంచి మొండి చెయ్యి ఎదురయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపం ట్రంప్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఎవరికి ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వరించిందో తెలుసా..
READ ALSO: AP Cabinet Decisions: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం..
Also Read
- Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
ఆమె పోరాటానికి దాసోహం అయిన నోబెల్
వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషికి, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ 2025 నోబెల్ శాంతి బహుమతిని మరియా కొరినా మచాడోకు ప్రదానం చేసింది.
వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు తన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో, నియంతృత్వాన్ని ఎదుర్కోవడంలో చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించిందని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ తెలిపారు. వెనిజులాలో ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలిగా, వెనిజులా ఉక్కు మహిళగా మరియా కొరినా మచాడోకు పేరు ఉంది. వెనిజులా దేశంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆమె కీలక వ్యక్తిగా ఎదిగారు. ఆమె అలుపులేని పోరాటానికి, ప్రజల తరుఫున నిలబడిన తీరుకు ఆమెకు నోబెల్ వరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వెనిజులా సాపేక్షంగా ప్రజాస్వామ్య, సంపన్న దేశం నుంచి క్రూరమైన, నిరంకుశ రాజ్యంగా పరిణామం చెందింది. ప్రస్తుతం ఈ దేశం మానవతా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా మంది వెనిజులా ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. దేశంలో అగ్రస్థానంలో ఉన్న కొద్దిమంది సంపన్నులు తమను తాము మరింత సంపన్నులు చేసుకుంటున్నప్పటికీ, అక్కడి ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పలు నివేదికల ప్రకారం.. ఇప్పటి వరకు దాదాపు 8 మిలియన్ల మంది దేశం విడిచి వెళ్ళారు. ఎన్నికల రిగ్గింగ్, చట్టపరమైన విచారణ, జైలు శిక్షల పేరుతో దేశంలో ప్రతిపక్షాన్ని ప్లాన్ ప్రకారం అణచివేశారని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Thyroid Diet Tips: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందులా? అయితే డైట్ ఇలా ప్లాన్ చేస్తే సరి
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!