Netanyahu: ప్రధాని మోడీతో మాట్లాడటానికి కీలక సమావేశాన్ని నిలిపేసిన నెతన్యాహూ..
- మోడీతో మాట్లాడేందుకు కీలక సమావేశాన్ని నిలిపేసిన నెతన్యాహూ..
- గాజా శాంతి ప్రణాళికపై అభినందనలు తెలిపిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netanyahu: రెండేళ్లుగా సాగుతున్న గాజా యుద్ధం ముగిసేందుకు మార్గం సుగమం అయింది. ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ఒప్పందం’’ కుదిరింది. గాజా శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చారు. ఈ నేపథ్యంలో, గురువారం ప్రధాని నరేంద్రమోడీ, ట్రంప్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు కూడా ప్రధాని మోడీ ఫోన్ చేశారు. అయతే, ఆ సమయంలో నెతన్యాహూ గాజా శాంతి ప్రణాళిక, కాల్పుల విరమణ, బందీల విడుదలపై భద్రతా కమిటీలో చర్చిస్తున్నారు. మోడీ ఫోన్ రావడంతో నెతన్యాహూ ఈ అత్యవసరం సమావేశాన్ని నిలిపేసినట్లు ఆయన కార్యాలయం చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది. ట్రంప్ 20- పాయింట్ల గాజా శాంతి ప్రణాళికపై ప్రధాని మోడీ ఇజ్రాయిల్ ప్రధానిని అభినందించారు. “బందీలందరినీ విడుదల చేయడానికి కుదిరిన ఒప్పందంపై ప్రధాని మోదీ ప్రధాని నెతన్యాహును అభినందించారు” అని నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
Read Also: Nobel Peace Prize 2025: పాపం ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చిందో తెలుసా!
ప్రధాని మోడీ, నెతన్యాహూతో మాట్లాడినట్లు ఎక్స్ ద్వారా చెప్పారు. “అధ్యక్షుడు ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక కింద సాధించిన పురోగతిపై అభినందించడానికి నా స్నేహితుడు ప్రధాన మంత్రి నెతన్యాహుకు ఫోన్ చేసాను. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాము. ప్రపంచంలో ఎక్కడైనా ఏ రూపంలోనైనా లేదా వ్యక్తీకరణలోనైనా ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పునరుద్ఘాటించాము’’ అని ట్వీట్ చేశారు.
ఇదే విషయాన్ని ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది. ‘‘ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడే భారత ప్రధాన మంత్రితో మాట్లాడారు. బందీలందరినీ విడుదల చేయడానికి సాధించిన ఒప్పందంపై నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి నెతన్యాహుకు తన అభినందనలు తెలిపారు’’ అని చెప్పింది.
తాజావార్తలు
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..