Site icon NTV Telugu

PM Modi: నేటి నుంచి 2 దేశాల్లో పర్యటించనున్న మోడీ

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నేటి నుంచి ఈనెల 26 వరకు రెండు దేశాల్లో పర్యటించనున్నారు. జూలై 23-26 తేదీల్లో యూకే, మాల్దీవుల్లో మోడీ పర్యటించనున్నారు. ఇటీవలే ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. కొద్ది రోజుల గ్యాప్‌లనే మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్లడం విశేషం.

ఇది కూడా చదవండి: HHVM : ఆ మూవీ నన్ను రాజకీయాల్లో నిలబెట్టింది : పవన్

23, 24 తేదీల్లో మోడీ యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటించనున్నారు. భారతదేశం-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులపై ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా భారతదేశానికి విస్కీ, కార్ల వంటి బ్రిటిష్ ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. ఇదిలా ఉంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Sonam Raghuvanshi: జైల్లో నెలరోజులు పూర్తి చేసుకున్న సోనమ్.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

ఇక జూలై 25-26 తేదీల్లో ప్రధాన మోడీ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకున్నారు. దీంతో భారతీయ టూరిస్టులు.. మాల్దీవులు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో నష్టాన్ని గుర్తించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు దిగొచ్చారు. గతేడాది ఢిల్లీలో జరిగిన మోడీ ప్రమాణస్వీకారానికి మాల్దీవుల అధ్యక్షుడు హాజరయ్యాడు. మొత్తానికి రాజకీయ ఉద్రిక్తతల తర్వాత మోడీ మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా మొహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడు అయ్యాక మోడీ పర్యటించడం కూడా ఇదే ప్రథమం. ఇక మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవ వేడుకలకు మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2019లో మోడీ మాల్దీవులకు వెళ్లారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మోడీ మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు.

Exit mobile version