PM Modi: నేడు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
- నేడు మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని..
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి స్టార్ట్ చేయనున్న మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (శనివారం) మూడు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్కు సంబంధించినవి ఉండగా.. అవి, తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్- నాగర్కోయిల్, మదురై- బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడవనున్నాయి. చెన్నై సెంట్రల్, మదురై జంక్షన్ స్టేషన్లలో వేడుకలు జరగనున్నాయి. మూడో రైలు.. ఉత్తరప్రదేశ్లోని మీరట్- లక్నో మధ్య నడవనుంది.
Read Also: Israeli Strike : గాజాలో వైద్య సహాయం తీసుకువెళుతున్న కాన్వాయ్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి
Also Read
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
అయితే, దక్షిణ రైల్వే జోన్లో నడవనున్న మూడు కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు. చెన్నై ఎగ్మోర్-నాగర్కోయిల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ (20627/20628) రైలు బుధవారాలు మినహా వారానికి ఆరు రోజుల పాటు నడుస్తుంది. చెన్నై ఎగ్మోర్, తాంబరం, విల్లుపురం, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మదురై, కోవిల్పట్టి, తిరునెల్వేలితో పాటు నాగర్కోయిల్ జంక్షన్లలో ఈ రైలు ఆగుతుంది. చెన్నై ఎగ్మోర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు నాగర్కోయిల్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో నాగర్కోయిల్లో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కు చేరుకుంటుంది. చైర్ కార్ ధర రూ. 1,760 కాగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3,240. క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి ఈ ప్రైస్ ఉంటుంది.
Read Also: Off The Record : జంపింగ్స్తో వైసీపీ ఉక్కిరి బిక్కిరి
ఇదిలా ఉండగా మదురై-బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ (20671/20672) రైలు సర్వీస్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజుల పాటు తన సేవలను అందిస్తుంది. ఇది దిండిగల్, తిరుచ్చిరాపల్లి, కరూర్, నమక్కల్, సేలం, కృష్ణరాజపురంలలో ఆగుతుంది. దక్షిణ రైల్వే షెడ్యూల్ ప్రకారం.. రైలు మదురై జంక్షన్ నుంచి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.45 గంటలకు మధురై చేరుకుంటుంది. ఒక చైర్ కార్ ధర రూ. 1,575, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ రూ. 2,865. క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి ఉంటుంది.
తాజావార్తలు
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!