PM Narendra Modi: యుద్ధం లేకపోవడం అంటే శాంతి కాదు.. పాకిస్తాన్కి పరోక్ష హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi to address third ‘No Money for Terror’ meet: ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో భారత్ ఎప్పుడూ దృఢంగా వ్యవహరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సులో అన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు కొత్త ఆర్థిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారని అన్నారు. మేము వేలాది ప్రాణాలను కోల్పోయామని.. అయితే మేము ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. ఒక్క ఉగ్రదాని కూడా మేం తక్కువగా భావించడం లేదని అన్నారు. యూనిఫాం జీరో టాలరెన్స్ అప్రోచ్ కోసం పిలుపునిచ్చారు.
టెర్రర్ ఫైనాన్సింగ్, రిక్రూట్మెంట్ కోసం కొత్త తరం టెక్నాలజీని వినియోగిస్తున్నారని..ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కొన్ని సార్లు మనీలాండరింగ్, ఆర్థిక నేరాలు కూడా తీవ్రవాద నిధులకు సహాయపడుతున్నాయని అన్నారు. అటువంటి దేశాలు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. టెర్రరిజాన్ని అడ్డుకునేందుకు ఐక్యరాజ్యసమితి, ఫైనాన్సియల్ యాక్షన్ ఫోర్స్( ఎఫ్ఏటీఎఫ్) సహాయం చేస్తున్నాయని అన్నారు.
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
Read Also: Twitter: ట్విట్టర్ ఉద్యోగుల రాజీనామా.. “నేనేం వర్రీ కావడం లేదంటున్న” మస్క్..
ఇదిలా ఉంటే టెర్రిరిజంపై పాకిస్తాన్ కు పరోక్షంగా హెచ్చరికలు పంపారు ప్రధాని నరేంద్రమోదీ. కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని.. ఆ దేశాలు ఒంటరి చేయాలని అన్నారు. యుద్ధం లేకపోవడం అంటే శాంతి ఉందని కాదని అంతర్జాతీయ సంస్థలను ఉద్దేశించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నకిలీ యుద్ధాలు కూడా ప్రమాదకరమైనవి, హింసాత్మకం అయినవని అన్నారు. ఉగ్రవాదంతో పోరాడటం, ఉగ్రవాదులతో పోరాటం చేయడం వేరని ఆయన అన్నారు. ఉగ్రవాదులను ఆయుధాలతో నేలకూల్చవచ్చని.. అయితే ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలంటే పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు. ఉగ్రవాదం మా ఇళ్లలోకి వచ్చే వరకు మేము చూసుకుంటూ ఉండలేమని ప్రధాని పరోక్షంగా ఉగ్రవాదులను హెచ్చరించారు. గతంలో ఏప్రిల్ 2018లో పారిస్ లో, నవంబర్ 2019లో మెల్బోర్న్ లో రెండు సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో మూడో సమావేశం జరగుతోంది. ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలకు ఫండింగ్ నిలిపే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
#WATCH | At 'No Money for Terror’ Conference, PM says, "…Well known that terrorist orgs get money through several sources-one is state support. Certain countries support terrorism as part of their foreign policy. They offer political, ideological & financial support to them…" pic.twitter.com/JwsK8qzVUR
— ANI (@ANI) November 18, 2022
తాజావార్తలు
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!