PM Modi: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ప్రధాని నరేంద్రమోడీ ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలన్స్కీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత ప్రధాని జెలన్స్కీతో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్-ఉక్రెయిన్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి కోసం కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు తీసుకురావడానికి మద్దతు ఇస్తుందని ప్రధాని, జెలన్స్కీకి తెలియజేశారు. భారతదేశం మానవతా సాయం కొనసాగిస్తుందని ఆయన చెప్పారు.
Read Also: PM Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్కి ప్రధాని మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
చర్యలు, దౌత్యంతో ఇరు దేశాలు ముందుకు వెళ్లాని ప్రధాని పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు సమస్యను త్వరగా, శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని ప్రధాని గతం నుంచి తెలియజేస్తున్నారు. ఉక్రెయిన్ ప్రజల కోసం భారత్ చేస్తున్న మానవతా సాయాన్ని జెలెన్స్కీ ప్రశంసించారు. ఇరు దేశాధినేతలు నిరంతరం టచ్లో ఉండేందుకు అంగీకరించారు. పుతిన్ మళ్లీ రష్యా దేశాధ్యక్షుడు కావడంతో మరోమారు ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రమయ్యే అవకాశం ఉన్న ఈ సమయంలో ప్రధాని మోడీ ఇటు పుతిన్, అటు జెలెన్స్కీలతో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది మేలో జపాన్ హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని నరేంద్రమోడీతో జెలెన్స్కీ భేటీ అయ్యారు.
ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో టెలిఫోన్లో సంభాషించారు. మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్-రష్యా మధ్య ప్రత్యే, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాల నేతలు అంగీకరించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. వెస్ట్రన్ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. మరోవైపు ఇరు దేశాలు కూడా చర్యలు, దౌత్యమార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచిస్తోంది.
Had a good conversation with President @ZelenskyyUa on strengthening the India-Ukraine partnership. Conveyed India’s consistent support for all efforts for peace and bringing an early end to the ongoing conflict. India will continue to provide humanitarian assistance guided by…
— Narendra Modi (@narendramodi) March 20, 2024
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!