PM Modi: విపక్షం తప్పు చేసింది.. పర్యవసానాలు చూస్తారు.. కేబినెట్లో మోడీ కీలక వ్యాఖ్యలు
- విపక్షం తప్పు చేసింది
- పర్యవసానాలు చూస్తారు
- కేబినెట్లో మోడీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడంతో విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో బిల్లు వీగిపోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం ఉదయం ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం తప్పు చేసిందని.. పర్యవసానాలు అనుభవిస్తారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు మహిళలకు ప్రతిపక్ష సభ్యులే సమాధానం చెప్పుకోవాలన్నారు.
Also Read
పార్లమెంటులో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేసే రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్సభలో ఆమోదం పొందడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా ఓట్లు రాలేదు. ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు కేవలం 298 మంది మాత్రమే ఆమోదం తెల్పగా.. 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. దీంతో మూడింట రెండొంతుల మెజార్టీ రాకపోవడంతో బిల్లు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఇదే అంశంపై ప్రియాంకాగాంధీ మీడియాతో మాట్లాడుతూ.. శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర పన్నిందని.. దాన్ని విపక్షం తిప్పికొట్టిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఇతర బిల్లులు కలపకుండా.. 2023లో ఆమోదం పొందిన బిల్లునే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. దేశం మారింది.. ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటే మాత్రం పరిస్థితులు ఇలానే ఉంటాయని సూచించారు.
తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం హడావిడిగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. సమావేశాల తర్వాత అజెండాను ప్రకటించదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపించి డీలిమిటేషన్ బిల్లును ఆమోదించి స్వప్రయోజనాలను పొందాలని చూసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించాలని బీజేపీ చూస్తోందని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!