PM Modi: ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోడీ ప్రసంగం.. ఎప్పుడంటే..?
- ఐక్యరాజ్య సమితి 79వ తేదీన సర్వసభ్య ప్రతినిధి సభ అత్యున్నత స్థాయి సమావేశం..
- సెప్టెంబరు 24 నుంచి 30వ తేదీ వరకు ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు..
- ఈ సమావేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఐక్యరాజ్య సమితి 79వ తేదీన సర్వసభ్య ప్రతినిధి సభ అత్యున్నత స్థాయి సమావేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ అంతర్జాతీయ వేదికపై సెప్టెంబర్ 26న మోడీ ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఐరాస విడుదల చేసిన ప్రొవిజినల్ జాబితాలో భారత ప్రధాన మంత్రి పేరు కూడా ఉంది. సెప్టెంబరు 24 నుంచి 30వ తేదీ వరకు ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్ దేశాధినేత ప్రసంగంతో సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ఆ తరువాత అమెరికా అధినేత మాట్లాడుతారు.. సెప్టెంబర్ 26న తేదీ మధ్యాహ్నం భారత దేశాధినేత ప్రసంగం ఉంటుందని ఐరాస తమ జాబితాలో పేర్కొంది. అయితే, ఇది తుది జాబితా కాదు.. సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులు, షెడ్యూల్లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంది.
Read Also: Warts Remove Naturally: ఎలాంటి నొప్పి లేకుండా పులిపిర్లను సహజంగా ఇలా తొలగించుకోండి!
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
కాగా, గతేడాది ఐక్యరాజ్య సమితి సర్వసభ్య భేటీకి ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు. తొలుత ప్రధాని ప్రసంగం ఉంటుందని ఐరాస ప్రకటించగా.. ఆ తర్వాత మార్చిన జాబితాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేరును చేర్చింది. అంతకు ముందు 2021 సెప్టెంబరులో జరిగిన వార్షిక సమావేశాల్లో ఐరాస వేదికపై ప్రధాని మోడీ ప్రసంగం చేసేశారు. ఇటీవలే మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మోడీ.. ఈసారి ఐక్యరాజ్యసమితి భేటీకి హాజరయ్యే ఛాన్స్ ఉంది. గతేడాది జరిగిన సర్వసభ్య సమావేశాలకు కొన్ని నెలల ముందు జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయానికి మోడీ వెళ్లారు. ఇక, ఈ ఏడాది జరిగే సమావేశాల్లో గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్పై తీర్మానం చేసే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!