డిజైన్.. అభివృద్ధి భారతదేశ నినాదం అని.. ఏఐ దేశానికి గొప్ప అవకాశం అని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సమ్మిట్కు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘‘ఏఐ కేంద్రంగా భారత్ మారుతుంది. నిప్పురవ్వను రాజేసిన యుగం నుంచి ఇప్పుడు ఏఐ యుగం వరకు మనిషి మేథస్సు ఎదిగింది. ప్రపంచంలో ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది.’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఏఐ సమ్మిట్ దక్షిణాసియాకే గర్వకారణం
‘‘ఏఐ మెషీన్ సెంట్రిక్గా కాదు.. హ్యుమన్ సెంట్రిక్గా ఉండాలి. ఏఐ మనల్ని కాదు. మనం ఏఐని శాసించాలి. ఏఐకి మనం ముడి సరుకుగా ఉండకూడదు. అన్ని రంగాల్లో సమస్యలకు ఏఐ పరిష్కారం చూపిస్తుంది. పారదర్శకత్వమే అన్నింటికంటే ఉత్తమమైన రక్షణ కవచం.’’ అని మోడీ పేర్కొన్నారు.
‘‘మనం నైపుణ్యాభివృద్ధి, పునఃనైపుణ్యం అభివృద్ధి, జీవితకాల అభ్యాసాన్ని ఒక సామూహిక ఉద్యమంగా మార్చాలి. భవిష్యత్తు సమ్మిళితంగా, విశ్వసనీయంగా.. మానవ కేంద్రీకృతంగా ఉంటుంది. మనం కలిసి ముందుకు సాగితే కృత్రిమ మేధస్సు మానవాళి సామర్థ్యాలను పెంచుతుంది.’’ అని అన్నారు.
AI కోసం MANAV దార్శనికతను ప్రవేశపెట్టారు. MANAV అంటే మానవుడు అని తెలిపారు.
MANAV అంటే అర్థం ఇదే
M అంటే నైతిక మరియు నైతిక వ్యవస్థ.
A అంటే జవాబుదారీ పాలన.
N అంటే జాతీయ సార్వభౌమాధికారం.
A అంటే యాక్సెస్ చేయగలది.. కలుపుకొని ఉండేది
V అంటే చెల్లుబాటు అయ్యేది.. చట్టబద్ధమైనది.
‘‘మానవులు డిజిటల్ ఇంటెలిజెన్స్ కలిసి సృష్టించి. కలిసి ముందుకు సాగే యుగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది మన వ్యవస్థలను మరింత తెలివిగా, మరింత సమర్థవంతంగా.. మరింత ప్రభావవంతంగా చేస్తుంది. ఇది సృజనాత్మక పాత్రలను పోషించడానికి ప్రజలకు మరిన్ని అవకాశాలను ఇస్తుంది. ఇది ఆవిష్కరణ, వ్యవస్థాపకత, కొత్త పరిశ్రమల సృష్టికి ఒక గొప్ప అవకాశం.’’ అని మోడీ పేర్కొ్న్నారు.
