PM Modi: “ఢిల్లీలో స్నేహితులు, కేరళలో శత్రువులు”.. కాంగ్రెస్, కమ్యూనిస్టులపై ప్రధాని విమర్శలు..
- కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ..
- కాంగ్రెస్, లెఫ్ట్ కూటములపై విమర్శలు..
- బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాలక్కాడ్లో జరిగిన భారీ సభాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, కమ్యూనిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్(లెఫ్ట్ కూటమి), యూడీఎఫ్(కాంగ్రెస్ కూటమి) తప్పుడు హామీలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. దశాబ్ధాలుగా కేరళ కాంగ్రెస్, కమ్యూనిస్టుల స్వార్థ రాజకీయాల్లో చిక్కుకుపోయిందని ఆరోపించారు. ఒకరు మతతత్వ వాదులు అయితే, మరొకరు తీవ్ర మతతత్వ వాదులు అని, ఒకరు అవినీతిపరులైతే మరొకరు అత్యంత అవినీతిపరులు అని రెండు కూటములపై ఫైర్ అయ్యారు. ఈ రెండు కూటములు కూడా ఓటు బ్యాంకు కోసమే అని, కేరళ అభివృద్ధిపై వారికి ఎలాంటి శ్రద్ధ లేదని ఆరోపించారు.
Read Also: Crime: చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బావమరిది దారుణహత్య..
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
‘‘కాంగ్రెస్ బీజేపీకి బీ-టీమ్ అని కమ్యూనిస్టులు అంటుంటే, కమ్యూనిస్టులు బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ అంటుంది. ఈ రెండు పార్టీలు కూడా కేరళలో బీజేపీ ముఖ్యమని ఒప్పుకున్నాయి’’ అని ప్రధాని అన్నారు. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో ఇండీ కూటమిలో భాగంగా కలిసి తిరుగుతారని, కేరళలో ప్రత్యర్థులుగా నటిస్తారని ప్రధాని అన్నారు. ఎల్డీఎఫ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందని మోడీ ఆరోపించారు.
మిడిల్ ఈస్ట్ లో యుద్ధం వల్ల భారతదేశంపై పడే ప్రభావాన్ని తమ ప్రభుత్వం తగ్గించేందకు కృషి చేస్తో్ందని, యుద్ధ పీడిత ప్రాంతాల్లో కేరళకు చెందిన ఎంతో మంది పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయా దేశాల నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుతున్నామని చెప్పారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు చాలా కుంభకోణాలకు పాల్పడ్డాయని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..