PM Modi: “ఢిల్లీలో స్నేహితులు, కేరళలో శత్రువులు”.. కాంగ్రెస్, కమ్యూనిస్టులపై ప్రధాని విమర్శలు..
- కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ..
- కాంగ్రెస్, లెఫ్ట్ కూటములపై విమర్శలు..
- బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాలక్కాడ్లో జరిగిన భారీ సభాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, కమ్యూనిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్(లెఫ్ట్ కూటమి), యూడీఎఫ్(కాంగ్రెస్ కూటమి) తప్పుడు హామీలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. దశాబ్ధాలుగా కేరళ కాంగ్రెస్, కమ్యూనిస్టుల స్వార్థ రాజకీయాల్లో చిక్కుకుపోయిందని ఆరోపించారు. ఒకరు మతతత్వ వాదులు అయితే, మరొకరు తీవ్ర మతతత్వ వాదులు అని, ఒకరు అవినీతిపరులైతే మరొకరు అత్యంత అవినీతిపరులు అని రెండు కూటములపై ఫైర్ అయ్యారు. ఈ రెండు కూటములు కూడా ఓటు బ్యాంకు కోసమే అని, కేరళ అభివృద్ధిపై వారికి ఎలాంటి శ్రద్ధ లేదని ఆరోపించారు.
Read Also: Crime: చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బావమరిది దారుణహత్య..
Also Read
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
‘‘కాంగ్రెస్ బీజేపీకి బీ-టీమ్ అని కమ్యూనిస్టులు అంటుంటే, కమ్యూనిస్టులు బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ అంటుంది. ఈ రెండు పార్టీలు కూడా కేరళలో బీజేపీ ముఖ్యమని ఒప్పుకున్నాయి’’ అని ప్రధాని అన్నారు. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో ఇండీ కూటమిలో భాగంగా కలిసి తిరుగుతారని, కేరళలో ప్రత్యర్థులుగా నటిస్తారని ప్రధాని అన్నారు. ఎల్డీఎఫ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందని మోడీ ఆరోపించారు.
మిడిల్ ఈస్ట్ లో యుద్ధం వల్ల భారతదేశంపై పడే ప్రభావాన్ని తమ ప్రభుత్వం తగ్గించేందకు కృషి చేస్తో్ందని, యుద్ధ పీడిత ప్రాంతాల్లో కేరళకు చెందిన ఎంతో మంది పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయా దేశాల నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుతున్నామని చెప్పారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు చాలా కుంభకోణాలకు పాల్పడ్డాయని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Jailer 2 : రజనీకాంత్ సినిమాలకు హైప్ తీసుకొస్తున్న ఐటంసాంగ్స్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
ట్రెండింగ్
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?