PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
- జూలై 6 నుంచి మూడు రోజుల విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.
- ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందంపై కీలక చర్చలు.
- రాడార్లు, మొబైల్ లాంచర్లు, శిక్షణ ప్యాకేజీపై చర్చించే అవకాశం.
- ఇండో-పసిఫిక్లో భారత్ రక్షణ దౌత్యానికి కీలక ముందడుగు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ జూలై 6 నుంచి మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియా బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా ‘‘బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్’’ ఒప్పందమే కీలకంగా మారనుంది. ఈ క్షిపణి వ్యవస్థను దశలవారీగా కొనుగోలు చేసే విషయంపై భారత్-ఇండోనేషియా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ిరు దేశాల సంబంధాల్లో ఈ ఒప్పందం మైలురాయిగా భావిస్తున్నారు.
మార్చిలో ఖరారు చేసిన ప్రాథమిక సింగిల్-సిస్టమ్ ఒప్పందానికి మించి ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి చర్చల్లో్ తీరప్రాంత మొబైల్ లాంచర్లు, రాడార్లు, శిక్షణ, నిర్వహణ, సమగ్ర సహాయ ప్యాకేజీ వంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఇండోనేషియాకు క్షిపణి మాత్రమే కాకుండా దాని పూర్తి భద్రత, నిర్వహణ వ్యవస్థల్ని కూడా అప్పగించనున్నారు.
Also Read
ఇండో-పసిఫిక్కు కీలకం..
భారత్ బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతులు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత దౌత్యానికి కీలకం కానున్నాయి. భారత్ ఇప్పటికే ఈ క్షిపణుల్ని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసింది. వియత్నాం, ఇండోనేషియాలు ఈ క్షిపణి కోసం చర్చలు జరుపుతున్నాయి. యూఏఈ కూడా దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. 2022 ఫిలిప్పీన్స్ 375 మిలియన్ డాలర్లలో బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024లో వీటి సరఫరా ప్రారంభమైంది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
-
Team India: ఇంగ్లాండ్ గడ్డపై శతకాలు బాదిన ముగ్గురు మొనగాళ్లు ఎవరో తెలుసా..? అందులో సూర్య కూడా..
-
Fishing Boat Accident : బోటు మునిగిన భయానక క్షణాలు.. ఓనర్ కన్నీటి గాథ.!
-
E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
-
T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!