Central Cabinet Decisions: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక
- 8వ వేతన సంఘాన్ని అమలు చేసేందుకు గ్రీన్సిగ్నల్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక అందించింది. ఉద్యోగులందరికీ 8వ వేతన సంఘాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.3,985 కోట్ల వ్యయంతో ఇస్రో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏడవ వేతన సంఘం పదవీకాలం 2026లో ముగుస్తుంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. త్వరలోనే కొత్త కమిషన్ ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు.
2014లో 7వ వేతన సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సిఫార్సులు జనవరి 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. పే కమీషన్లు, ఉద్యోగుల వేతన నిర్మాణం, స్కేల్ను మార్చడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేయడానికి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. 1947 నుంచి ఏడు పే కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. చివరిది 2016లో అమలు చేయబడింది.
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
ఇది కూడా చదవండి: Brahmanandam: నాకు వేషాలు లేక.. ఇవ్వక కాదు.. అందుకే సినిమా చేయడం తగ్గించా!
8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతభత్యాలు, కరవు భత్యం, పెన్షన్ పెరగనున్నాయి. చాలా కాలంగా ఈ ప్రకటన కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి కానుకగా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Brahmanandam: బ్రహ్మానందానికి శేఖర్ కమ్ముల ఇంత దగ్గరి చుట్టమా?
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, "Prime Minister has approved the 8th Central Pay Commission for all employees of Central Government…" pic.twitter.com/lrVUD25hFu
— ANI (@ANI) January 16, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!