PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
- రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ
- ఇంధన ధరలు, వర్క్ ఫ్రమ్ హోమ్పై చర్చ
- పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్
- రేపటి కేబినెట్ భేటీ సర్వత్రా ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిత్యావసర ధరలు పెరగబోతున్నాయా? పెట్రోల్, డీజిల్ ధరలు షాకివ్వనున్నాయా? వాహనదారులపై భారీ వడ్డన పడనుందా? డొమిస్టిక్ గ్యాస్ ధర పెంపుతో వంటింట్లో మంట పుట్టించనుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది.
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదివారం హైదరాబాద్ వేదికగా జరిగిన సభలోనూ.. సోమవారం వడోదర వేదికగా జరిగిన సభలోనూ ప్రధాని మోడీ కీలక పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా పొదుపు మంత్రం పాటించాలని కోరారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో కోవిడ్ తరహాలో కఠిన నిబంధనలు పాటించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లుగా మోడీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
Also Read
- Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
- Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
- LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
కేబినెట్ సమావేశంలో ఇంధన ధరల పెంపు, వర్క్ ఫ్రమ్ హోమ్పై ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ సంస్థలు ఇప్పటికే రోజుకి వెయ్యి కోట్ల నష్టం ఎదుర్కొంటున్నాయి. లక్ష కోట్లు నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంధన ధరలు పెంచాలని ఆయిల్ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇక ఇంధన ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాక్ చేసిన ఆహారాలు, పానీయాలు వంటి రోజువారీ గృహోపకరణ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇక ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయవద్దని పౌరులకు ఇప్పటికే ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రేపటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.
తాజావార్తలు
-
PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
-
Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
-
Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్న్యూస్..ఇండియాలో వర్షాలు..!
-
Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!