PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
- రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ
- ఇంధన ధరలు, వర్క్ ఫ్రమ్ హోమ్పై చర్చ
- పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్
- రేపటి కేబినెట్ భేటీ సర్వత్రా ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిత్యావసర ధరలు పెరగబోతున్నాయా? పెట్రోల్, డీజిల్ ధరలు షాకివ్వనున్నాయా? వాహనదారులపై భారీ వడ్డన పడనుందా? డొమిస్టిక్ గ్యాస్ ధర పెంపుతో వంటింట్లో మంట పుట్టించనుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది.
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదివారం హైదరాబాద్ వేదికగా జరిగిన సభలోనూ.. సోమవారం వడోదర వేదికగా జరిగిన సభలోనూ ప్రధాని మోడీ కీలక పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా పొదుపు మంత్రం పాటించాలని కోరారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో కోవిడ్ తరహాలో కఠిన నిబంధనలు పాటించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లుగా మోడీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
Also Read
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
కేబినెట్ సమావేశంలో ఇంధన ధరల పెంపు, వర్క్ ఫ్రమ్ హోమ్పై ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ సంస్థలు ఇప్పటికే రోజుకి వెయ్యి కోట్ల నష్టం ఎదుర్కొంటున్నాయి. లక్ష కోట్లు నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంధన ధరలు పెంచాలని ఆయిల్ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇక ఇంధన ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాక్ చేసిన ఆహారాలు, పానీయాలు వంటి రోజువారీ గృహోపకరణ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇక ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయవద్దని పౌరులకు ఇప్పటికే ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రేపటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.
తాజావార్తలు
-
Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
-
Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!