PM Modi: మే 4 తర్వాత పశ్చిమ బెంగాల్లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం ఆయన బెంగాల్ రెండో విడత పోలింగ్కు సంబంధించి ప్రచారంలో పాల్గొన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని జరిగిన ఓ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. టీఎంసీ బెంగాల్ భూమిని, చొరబాటుదారులకు అప్పగించిందని, టీఎంసీ బెంగాల్ తల్లిని ఏడ్పించిందని ఆరోపించారు. టీఎంసీ అరాచక పాలన నుంచి బెంగాల్ ఇప్పుడు స్వేచ్ఛ కొరుకుంటోందని, తొలి విడత ఎన్నికలతో తృణమూల్ అహంకారం బద్ధలైందని ప్రధాని అన్నారు.
Read Also: Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
15 ఏళ్ల క్రితం టీఎంసీ ‘‘మా-మాటి-మనుష్’’(తల్లి, భూమి, ప్రజలు) అనే నినాదంలో అధికారంలోకి వచ్చిందని, కానీ ఈ రోజు టీఎంసీ ఆ మాటలు మాట్లాడటం లేదని, వారు బెంగాల్ భూమిని ల్యాండ్ సిండికేట్లు, మాఫియా, చొరబాటుదారులకు అప్పగించిందని, బెంగాల్ ప్రజలు వలస వెళ్లేలా చేసిందని ప్రధాని మోడీ ఆరోపించారు.
మే 4 తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఇక్కడి మహిళల్ని హింసించిన గుండాల సంగతి బీజేపీ ప్రభుత్వం తేలుస్తుందని, మాఫియా పాలన అంతం కావడం ఖాయమని అన్నారు. మొదటి దశలో బెంగాల్ కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన, రెండో దశలో బీజేపీ భారీ విజయాన్ని ఖరారు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఎంసీ దురాగతాలను సమూలంగా నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
