Breaking News: సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం..
- సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ..
- జీఎస్టీ సంస్కరణలు, హెచ్1బీ వీసా, టారిఫ్ వార్ గురించి మాట్లాడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే, ఏ అంశంపై ప్రధాని మాట్లాడుతారనే దానిపై అధికార వర్గాలు ధ్రువీకరించలేదు. దీంతో ప్రధాని ఏ అంశం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రసంగం జీఎస్టీ(GST) సంస్కరణలకు ముందు వస్తోంది.రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. ప్రధాని ప్రసంగంలో ఈ అంశం ఉండే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాతో టారిఫ్ వార్, H1 B వీసాదారులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవడంపై కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న H1 B చర్యలు, వేలాది మంది భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావివం చేస్తుంది.
Read Also: Fake Notes: దుబ్బాకలో దొంగనోట్ల కలకలం.. ఒకే నంబర్ తో కూడిన రూ. 200 నోట్లు ప్రత్యక్షం
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి పలు సందర్భాల్లో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు. కీలక నిర్ణయాలను ప్రకటించారు. నవంబర్ 8, 2016 న, ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి, రూ. 500 మరియు రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాద దాడి తరువాత ప్రారంభించిన బాలాకోట్ వైమానిక దాడులను ప్రధాన మంత్రి ప్రకటించిన మార్చి 12, 2019 న మరోసారి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి మూడు వారాల దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రకటించడానికి ప్రధాన మంత్రి మార్చి 24, 2020 న దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. లాక్డౌన్ పొడిగింపును ప్రకటించడానికి ఆయన ఏప్రిల్ 14, 2020 న మళ్ళీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మే నెలలో, ప్రభుత్వం లాక్డౌన్ను సడలించాలని నిర్ణయించిందని ఆయన జాతికి తెలిపారు.ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మే 12, 2025లో దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
Prime Minister Narendra Modi will address the nation today at 5 pm. pic.twitter.com/YFJc7fLdVu
— ANI (@ANI) September 21, 2025
తాజావార్తలు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!