Breaking News: సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం..
- సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ..
- జీఎస్టీ సంస్కరణలు, హెచ్1బీ వీసా, టారిఫ్ వార్ గురించి మాట్లాడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే, ఏ అంశంపై ప్రధాని మాట్లాడుతారనే దానిపై అధికార వర్గాలు ధ్రువీకరించలేదు. దీంతో ప్రధాని ఏ అంశం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రసంగం జీఎస్టీ(GST) సంస్కరణలకు ముందు వస్తోంది.రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. ప్రధాని ప్రసంగంలో ఈ అంశం ఉండే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాతో టారిఫ్ వార్, H1 B వీసాదారులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవడంపై కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న H1 B చర్యలు, వేలాది మంది భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావివం చేస్తుంది.
Read Also: Fake Notes: దుబ్బాకలో దొంగనోట్ల కలకలం.. ఒకే నంబర్ తో కూడిన రూ. 200 నోట్లు ప్రత్యక్షం
Also Read
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి పలు సందర్భాల్లో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు. కీలక నిర్ణయాలను ప్రకటించారు. నవంబర్ 8, 2016 న, ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి, రూ. 500 మరియు రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాద దాడి తరువాత ప్రారంభించిన బాలాకోట్ వైమానిక దాడులను ప్రధాన మంత్రి ప్రకటించిన మార్చి 12, 2019 న మరోసారి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి మూడు వారాల దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రకటించడానికి ప్రధాన మంత్రి మార్చి 24, 2020 న దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. లాక్డౌన్ పొడిగింపును ప్రకటించడానికి ఆయన ఏప్రిల్ 14, 2020 న మళ్ళీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మే నెలలో, ప్రభుత్వం లాక్డౌన్ను సడలించాలని నిర్ణయించిందని ఆయన జాతికి తెలిపారు.ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మే 12, 2025లో దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
Prime Minister Narendra Modi will address the nation today at 5 pm. pic.twitter.com/YFJc7fLdVu
— ANI (@ANI) September 21, 2025
తాజావార్తలు
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!