Breaking News: సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం..
- సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ..
- జీఎస్టీ సంస్కరణలు, హెచ్1బీ వీసా, టారిఫ్ వార్ గురించి మాట్లాడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే, ఏ అంశంపై ప్రధాని మాట్లాడుతారనే దానిపై అధికార వర్గాలు ధ్రువీకరించలేదు. దీంతో ప్రధాని ఏ అంశం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రసంగం జీఎస్టీ(GST) సంస్కరణలకు ముందు వస్తోంది.రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. ప్రధాని ప్రసంగంలో ఈ అంశం ఉండే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాతో టారిఫ్ వార్, H1 B వీసాదారులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవడంపై కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న H1 B చర్యలు, వేలాది మంది భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావివం చేస్తుంది.
Read Also: Fake Notes: దుబ్బాకలో దొంగనోట్ల కలకలం.. ఒకే నంబర్ తో కూడిన రూ. 200 నోట్లు ప్రత్యక్షం
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి పలు సందర్భాల్లో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు. కీలక నిర్ణయాలను ప్రకటించారు. నవంబర్ 8, 2016 న, ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి, రూ. 500 మరియు రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాద దాడి తరువాత ప్రారంభించిన బాలాకోట్ వైమానిక దాడులను ప్రధాన మంత్రి ప్రకటించిన మార్చి 12, 2019 న మరోసారి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి మూడు వారాల దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రకటించడానికి ప్రధాన మంత్రి మార్చి 24, 2020 న దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. లాక్డౌన్ పొడిగింపును ప్రకటించడానికి ఆయన ఏప్రిల్ 14, 2020 న మళ్ళీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మే నెలలో, ప్రభుత్వం లాక్డౌన్ను సడలించాలని నిర్ణయించిందని ఆయన జాతికి తెలిపారు.ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మే 12, 2025లో దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
Prime Minister Narendra Modi will address the nation today at 5 pm. pic.twitter.com/YFJc7fLdVu
— ANI (@ANI) September 21, 2025
తాజావార్తలు
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!