Omar Abdullah: ప్రధాని మోడీపై వ్యక్తిగత దాడి మనల్నే దెబ్బతీస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత విమర్శలు ప్రతిపక్షాలకే ఎదురుదెబ్బగా మారుతున్నాయని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. భారతదేశం పేదగా మారితే, బీజేపీ ధనవంతమైందని ఆరోపించారు. శనివారం ఇండియా టుడే కాన్క్లేవ్ 2024లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై వ్యతిగత దాడికి దిగిన ప్రతీసారి అది బూమరాంగ్ అవుతోందని అన్నారు.
ప్రధానిపై వ్యకిగత దాడి పనిచేయదని, ఇది పలు సందర్భాల్లో రుజువైందని ఒమర్ అబ్దుల్లా అన్నారు. గత అనుభవాలు కూడా ఇదే చెబుతోందని.. ‘‘చౌకీదార్ చోర్ హై’’, ‘‘ అదానీ-అంబానీ’’ పనికిరావని చెబుతోందని, మీకు నచ్చినా, నచ్చకపోయినా ఇది వాస్తవమని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి వద్ద డబ్బు ఉందని మీరు కేసు పెట్టలేరు, ఎందుకంటే దానిని నిరూపించడానికి ఆధారాలు లేవని, కానీ భారతదేశంలో చాలా భాగం పేదగా మారితే, బీజేపీ రిచ్ అయిందని, 50 శాతం ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకే ఇవ్వబడ్డాయని ఆయన అన్నారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
Read Also: Telangana: హస్తం, కమలం పార్టీల మధ్యే పోటీ.. రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషీలు రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి వ్యూహాలపై చర్చించారు. ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారత కూటమి పోటీ చేస్తుందని, గెలుస్తుందా..? లేదా..? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని సచిన్ పైలట్ అన్నారు. గత 9 ఏళ్లుగా దేశం చూసిన పరిస్థితుల కారణంగా ఇండియా కూటమి ముందుకు వచ్చిందని, దేశంలో సుస్థిరమైన రాజ్యాంగ సంస్థలపై ఒక క్రమపద్ధతిలో దాడి జరుగుతోందని, విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎన్డీయేకు గట్టి పోటీ ఇవ్వడమే కూటమి లక్ష్యమని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి 37 శాతం ఓట్లు వచ్చాయి, అంటే మూడింట రెండొంతులు మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారని ఆయన అన్నారు. ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ.. దేశం పెద్ద ప్రమాదంలో ఉందని అందుకే ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పారు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!