PM-Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ వారమే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM-Kisan: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) యోజన 23వ విడత నిధుల విడుదల తేదీని కేంద్ర సర్కార్ అధికారికంగా ఖరారు చేసింది. వచ్చే జూన్ 20న (ఈ వారంలోనే) దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9 కోట్లకు పైగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా రూ.2,000 చొప్పున నగదు జమ కానుంది. అయితే ఈ నిధులు అందుకోవాలంటే రైతులు ఒక ముఖ్యమైన పనిని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ.6,000 సహాయం..
రైతులకు పెట్టుబడి సాయం అందించి, వారి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ పథకాన్ని స్టార్ట్ చేసింది. దీని కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000లను నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది. విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల వంటి వ్యవసాయ అవసరాలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. గత మార్చి 13న ప్రభుత్వం 22వ విడత కింద రూ.18,640 కోట్లను సుమారు 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
- Energy Crisis: భారత్లో మరోసారి ఇంధన సంక్షోభం రానుందా? నిపుణుల ఆందోళన ఎందుకు?
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు కీలక పదవి? పార్లమెంట్ దగ్గర కాంగ్రెస్ నేతతో ఆసక్తికర సంభాషణ
- CJP: కాక్రోచ్ల సంబరాలకు డబ్బు ఎక్కడిది.? మహేష్ జెఠ్మలానీ అనుమానాలు..
ఇ-కేవైసీ (e-KYC) లేకపోతే పైసలు రావు..
23వ విడత లబ్ధి పొందడానికి రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఇ-కేవైసీ అసంపూర్తిగా ఉంటే, సదరు రైతుల ఖాతాలకు ఈ విడత నిధులు బదిలీ కావని స్పష్టం చేసింది. మోసపూరిత లబ్ధిదారులను ఏరివేసి, కేవలం అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను కఠినతరం చేసింది.
ఆన్లైన్లో e-KYC ఇలా పూర్తి చేయండి ..
రైతులు జూన్ 20 లోపు తమ మొబైల్ లేదా సిస్టమ్ ద్వారా ఇంట్లోనే కూర్చొని ఈ క్రింది పద్ధతిలో ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు..
* మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
* తర్వాత హోమ్పేజీలో కుడివైపున కనిపించే “e-KYC” ఆప్షన్పై క్లిక్ చేయాలి.
* అక్కడ మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేయాలి.
* తర్వాత మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే OTPని ఎంటర్ చేయాలి.
* వివరాలు ధృవీకరించిన తర్వాత, మీ ఇ-కేవైసీ ప్రక్రియ సక్సెస్ అవుతుంది.
ఒకవేళ మీ మొబైల్ నంబర్కు OTP రాకపోతే.. వెంటనే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా జన్ సేవా కేంద్రాన్ని సందర్శించి, బయోమెట్రిక్ (వేలిముద్ర) ద్వారా మీ ఇ-కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.
మీ e-KYC స్టేటస్ ఎలా తనిఖీ చేసుకోవాలంటే..
మీ ఇ-కేవైసీ ఇప్పటికే పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
* పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
* అక్కడ “Know Your Status” పై క్లిక్ చేయండి.
* మీ రిజిస్ట్రేషన్ నంబర్, స్క్రీన్పై ఉన్న క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి.
* వెంటనే మీ స్క్రీన్పై ఇ-కేవైసీ స్టేటస్ యాక్టివ్గా ఉందో లేదో చూపిస్తుంది.
కాబట్టి, లబ్ధిదారులైన రైతులందరూ జూన్ 20 లోపే తమ ఇ-కేవైసీ స్టేటస్ చెక్ చేసుకుని, ఎలాంటి ఇబ్బంది లేకుండా రూ.2,000 అకౌంట్లలో పడేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Direct support, stronger farmers!
Mark the date: 23rd instalment of PM-KISAN is set to be released on 20th June 2026, bringing continued financial strength directly to the accounts of our Annadatas.#PMKISAN #23rdinstallment pic.twitter.com/W9QtUiTyFk
— PM Kisan Samman Nidhi (@pmkisanofficial) June 15, 2026
తాజావార్తలు
-
Nitin Gadkari: E20పై తప్పుడు ప్రచారం.. మెటా, ఎక్స్, గూగుల్పై నితిన్ గడ్కరీ పరువునష్టం దావా.!
-
Rain Alert : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 3 గంటల్లో వర్షం, 40 కిమీ వేగంతో ఈదురుగాలులు.!
-
Energy Crisis: భారత్లో మరోసారి ఇంధన సంక్షోభం రానుందా? నిపుణుల ఆందోళన ఎందుకు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు షాక్.. వెంటనే తొలగించాలని ఆదేశం.!
-
Kishan Reddy : కేసీఆర్ మొండి వైఖరితోనే సింగరేణికి తీరని అన్యాయం
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!