Pinarayi Vijayan: CAAపై కాంగ్రెస్ మౌనం ఎందుకు.? కాంగ్రెస్పై మిత్రపక్షం ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pinarayi Vijayan: కాంగ్రెస్ పార్టీపై ఇండియా కూటమిలో మిత్రపక్షంగా ఉన్న సీపీఎం విరుచుకుపడింది. ఆ పార్టీ నేత, కేరళ సీఎం పినరయి విజయన్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫేస్టోలో పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై ప్రస్తావన లేకపోవడాన్ని సీఎం ప్రశ్నించారు. సీఏఏపై కాంగ్రెస్ ’’నేరపూరిత మౌనం’’ అవలంభిస్తోందని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ సవాళ్లను కాంగ్రెస్ సీరియస్గా తీసుకోవడం లేదని ఆరోపించారు.
Read Also: Siddaramaiah: మోడీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేయండి.. ఓటర్లను కోరిన సీఎం..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఆర్ఎస్ఎస్ తమ విపరీతమైన హిందుత్వ రాజకీయాలతో భారీ సవాళ్లను లేవనెత్తుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫేస్టో ఆ సవాళ్లను తీవ్రంగా పరిగణించడం లేదని అన్నారు. మనదేశంలో సీఏఏ విభజనకు కారణమయ్యే ప్రమాదకమైన ఉపాయమని పేర్కొన్నారు. సీపీఎం మేనిఫేస్టోలో సీఏఏ రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. సీఏఏపై కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అలప్పుజలో శనివారం ఆయన అన్నారు.
గత ఐదేళ్ల అనుభవంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రయోజనం లేదని ప్రజలు అర్థం చేసుకున్నారని, గతంలో జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల, బయట నిరసనలు తెలపడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. ఇదిలా ఉంటే, సీఏఏకి వ్యతిరేకంగా పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేరళ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ మతరాజకీయాలు వామపక్షాలు అనుమతించవని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలువకుండా చూస్తామని అన్నారు. బీజేపీ 20 స్థానాల్లో ఓడిపోతుందని అన్నారు. కేరళలో రెండో దశ ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!