Pinarayi Vijayan: అగ్నిపథ్ని నిలిపివేయండి..మోడీకి కేరళ సీఎం లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీం మంటలు రాజేస్తోంది. ఈ పథకంపై విపక్షాలు, నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశ యువతకు ఉద్యోగాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తినా.. కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఈ పథకంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధినేతలతో వరుసగా రెండో సారి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం త్రివిధ దళాల అధిపతులు… అగ్నిపథ్ పథకంపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా అగ్నివీర్లకు లభించే సౌలభ్యాలను కూడా వారు వివరించారు.
అగ్నిపథ్ పథకాన్ని వాయిదా వేయాలంటూ ప్రధానమంత్రికి లేఖ రాశారు కేరళ సీఎం పినరయి విజయన్. అగ్నిపథ్ పథకంపై పునరాలోచన చేయాలంటూ కేరళ సీఎం లేఖ రాశారు. తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని నిలిపివేయాలని కోరిన విజయన్… యువతలో నెలకొన్న ఆందోళనలపై దృష్టి సారించాలని కోరారు. మరోవైపు అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.
Also Read
- PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
- Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
నాలుగేళ్ల పాటు పనిచేసిన అగ్నివీరులను బీజేపీ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులుగా తీసుకుంటామని విజయవర్గీయ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులను నియమించేటప్పుడు మొదటి ప్రాధాన్యత ఈ అగ్నివీరులకే ఇస్తామని ఆయన అన్నారు. విజయ్ వర్గీయ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. యువతను, ఆర్మీ సిబ్బందిని చులకన చేయొద్దని హితవు పలికారు. కైలాష్ విజయ్ వర్గీయ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం వ్యంగ్యంగా స్పందించారు. భారత సైన్యంలో పనిచేసి వచ్చిన అగ్నివీరులను రాజకీయ పార్టీ ల ఆఫీసుల ముందు కాపలాదారుగా నియమిస్తారా. అలా నియమించే వ్యక్తికి శుభాకాంక్షలు అంటూ కామెంట్ చేశారు వరుణ్ గాంధీ.
Protests erupting against the Agnipath Scheme is a clear indication of the sentiments of India's youngsters. In the interest of our country, requested the Hon.@PMOIndia to put the scheme on hold, address criticism by professionals and duly consider the apprehensions of our youth.
— Pinarayi Vijayan (@pinarayivijayan) June 18, 2022
Finance Ministry: విమాన ప్రయాణానికి ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
తాజావార్తలు
-
Sai Krishna Case Updates: సాయికృష్ణ కస్టోడియల్ డె*త్ కేసు.. సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
-
Emraan Hashmi: ఐశ్వర్యపై చేసిన కామెంట్ తప్పే.. నిజం ఒప్పుకున్న బాలీవుడ్ హీరో
-
Shreyas Iyer: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
-
Seven Fishermen Missing: విశాఖ తీరంలో ఉత్కంఠ.. సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ గాలింపు
-
TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!