Pinarayi Vijayan: కేంద్రానికి కేరళ సీఎం లేఖ.. వ్యాపారి సీజే.రాయ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్
- కేంద్రానికి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
- వ్యాపారి సీజే.రాయ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్
- జనవరి 30న బెంగళూరులో సీజే.రాయ్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 30న బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ సోదాల సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, రియాల్టీ షోల నిర్వాహకుడు సీజే. రాయ్ మరణంపై న్యాయ విచారణ జరపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు.
ఈ సంఘటన ‘దేశ పన్ను పరిపాలనపై మచ్చ’’గా అభివర్ణించారు. సోదాల సమయంలో జరిగిన విధానపరమైన లోపాల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఉన్నప్పుడు రాయ్ ఎలా లోడ్ చేసిన తుపాకీని పొందగలిగారని ప్రశ్నించారు. ‘‘ప్రోటోకాల్ యొక్క తీవ్రమైన వైఫల్యం.’’గా పేర్కొన్నారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఐటీ అధికారులు వేధించారని రాయ్ సోదరుడు చేసిన ప్రకటనలను గుర్తుచేశారు. ఐటీ అధికారులు కుటుంబాన్ని వేధించారని చేసిన ఆరోపణలను కూడా సీఎం హైలైట్ చేశారు. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని నిష్పాక్షిక న్యాయ విచారణ మాత్రమే పూర్తి సత్యాన్ని బయటకు తీసుకురాగలదని చెప్పారు. కర్ణాటక పోలీసుల దర్యాప్తును అంగీకరిస్తున్నామని.. పరిపాలనా విధానాలు, తగిన శ్రద్ధ, అధికారుల ప్రవర్తనను పరిశీలించడానికి విస్తృత దర్యాప్తు అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ఆలస్యం లేకుండా విచారణకు ఆదేశించాలని.. కాలపరిమితి నివేదికను సమర్పించాలని కేంద్రాన్ని కోరారు.
అసలేం జరిగిందంటే..
శుక్రవారం బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. అదే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో లైసెన్స్డ్ తుపాకీతో ఛాతీలో కాల్చుకుని సీజే.రాయ్ ప్రాణాలు తీసుకున్నారు. సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సీజే రాయ్కు భార్య లిని రాయ్, కుమారుడు రోహిత్, కుమార్తె రియా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా విదేశాల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. అశోక్నగర పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Kerala Chief Minister Pinarayi Vijayan has written to Union Finance Minister Nirmala Sitharaman seeking a judicial inquiry into the death of C.J. Roy, Chairman of the Confident Group, who died by suicide during an Income Tax search in Bengaluru on January 30.
In the letter, the…
— ANI (@ANI) February 2, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!