PhonePe: సీఎంపై కాంగ్రెస్ పోస్టర్లు.. లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న ఫోన్ పే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PhonePe: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పుడే ప్రచారం ఊపందుకుంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కర్ణాటక ఎన్నికల్లో అవలంభించిన స్ట్రాటజీనే వాడుతోంది. మధ్యప్రదేశ్ లో కూడా సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ పోస్టర్లు వేశారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకే ఎదురుతిరిగింది. ఈ పోస్టర్ల కోసం కాంగ్రెస్ ప్రముఖ ఫిన్టెక్ సేవల సంస్థ ‘ఫోన్ పే’ లోగోను వాడింది. దీంతో వివాదం మొదలైంది.
ఫోన్ పే లోగో, క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి. వీటిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటోలను ముద్రించింది కాంగ్రెస్ పార్టీ. ఈ చిత్రాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. రాష్ట్రంలో పని జరగాలంటే 50 శాతం కమీషన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శలు గుప్పించింది. ఇటువంటి పోస్టర్లు చింద్వారా, రేవా, సత్నా మరియు రాష్ట్ర రాజధాని నగరం భోపాల్లో కూడా కనిపించాయి. ఆ తరువాత అధికారులు వీటిని తొలగించారు.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: CARE Hospitals : కేర్ ఆస్పత్రిలో విజయవంతంగా క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీ
అయితే దీనిపై ఫోన్ పే ఘాటుగానే స్పందించింది. మా బ్రాండ్ లోగోను దుర్వినియోగం చేస్తున్నారు.. దీన్ని వ్యతిరేకిస్తున్నామని, మాకు ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేదని, దీనిపై చట్టపరమైన చర్యయలు తీసుకుంటామని హెచ్చరించింది. మా బ్రాండ్ లోగో మరియు రంగును కలిగి ఉన్న పోస్టర్లు మరియు బ్యానర్లను తీసివేయమని మేము మధ్యప్రదేశ్ కాంగ్రెస్ని వినమ్రంగా అభ్యర్థిస్తున్నామని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఈలోగా, పోస్టర్లు అతికించిన గుర్తు తెలియని వ్యక్తులపై పడవ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది మరియు పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. తన పార్టీ పరువు తీస్తున్నారని బీజేపీ కార్యకర్త ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని గ్వాలియర్ ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ తెలిపారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!