PhonePe: సీఎంపై కాంగ్రెస్ పోస్టర్లు.. లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న ఫోన్ పే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PhonePe: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పుడే ప్రచారం ఊపందుకుంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కర్ణాటక ఎన్నికల్లో అవలంభించిన స్ట్రాటజీనే వాడుతోంది. మధ్యప్రదేశ్ లో కూడా సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ పోస్టర్లు వేశారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకే ఎదురుతిరిగింది. ఈ పోస్టర్ల కోసం కాంగ్రెస్ ప్రముఖ ఫిన్టెక్ సేవల సంస్థ ‘ఫోన్ పే’ లోగోను వాడింది. దీంతో వివాదం మొదలైంది.
ఫోన్ పే లోగో, క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి. వీటిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటోలను ముద్రించింది కాంగ్రెస్ పార్టీ. ఈ చిత్రాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. రాష్ట్రంలో పని జరగాలంటే 50 శాతం కమీషన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శలు గుప్పించింది. ఇటువంటి పోస్టర్లు చింద్వారా, రేవా, సత్నా మరియు రాష్ట్ర రాజధాని నగరం భోపాల్లో కూడా కనిపించాయి. ఆ తరువాత అధికారులు వీటిని తొలగించారు.
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Read Also: CARE Hospitals : కేర్ ఆస్పత్రిలో విజయవంతంగా క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీ
అయితే దీనిపై ఫోన్ పే ఘాటుగానే స్పందించింది. మా బ్రాండ్ లోగోను దుర్వినియోగం చేస్తున్నారు.. దీన్ని వ్యతిరేకిస్తున్నామని, మాకు ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేదని, దీనిపై చట్టపరమైన చర్యయలు తీసుకుంటామని హెచ్చరించింది. మా బ్రాండ్ లోగో మరియు రంగును కలిగి ఉన్న పోస్టర్లు మరియు బ్యానర్లను తీసివేయమని మేము మధ్యప్రదేశ్ కాంగ్రెస్ని వినమ్రంగా అభ్యర్థిస్తున్నామని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఈలోగా, పోస్టర్లు అతికించిన గుర్తు తెలియని వ్యక్తులపై పడవ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది మరియు పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. తన పార్టీ పరువు తీస్తున్నారని బీజేపీ కార్యకర్త ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని గ్వాలియర్ ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ తెలిపారు.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!