CARE Hospitals : కేర్ ఆస్పత్రిలో విజయవంతంగా క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి మీడియా వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కేర్ ఆస్పత్రి కార్డియాక్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ నేతృత్వంలో వైద్య బృందం.. 50 ఏళ్ల రోగి హేమంత్ కు కేవలం ధమని అంటుకట్టులను ఉపయోగించి నాలుగు రెట్ల కరోనరీ బైపాస్ సర్జరీని చేశారు. హేమంత్ గతంలో తన ఎడమ ప్రధాన కరోనరీకి స్టంట్ లను వేయించుకున్నారు కూడా, అయితే మూడు నెలల్లోనే అడ్డంకి ఏర్పడింది.
ఢిల్లీకి చెందిన హేమంత్, ఛాతి నొప్పితో బాధపడుతూ గతంలో ఢిల్లీలోనే కరోనరి యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. ఈ వైద్య పరీక్షలో అతని ఎడమ ప్రధాన, ఇతర కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఉన్నట్లు వెల్లడైంది, దీంతో వైద్యులు సెంట్లు వేశారు. అయితే మూడు నెలల్లోనే మరలా చాతి నొప్పి తలెత్తడంతో అతను బంజారా హిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందాలని నిర్ణయించుకున్నారు.
Also Read
- Aura Dental : హైదరాబాద్లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
- Padmam Silver Jewellery: అనకాపల్లిలో పద్మం సిల్వర్ జువెలరీ ఘనంగా ప్రారంభం
ఈ క్రమంలో హేమంత్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ ను సంప్రదించారు. ఇక్కడ సైతం కరోనరీ యాంజియోగ్రఫీ వైద్య పరీక్షలు చేశారు. మూడు నెలల వ్యవధిలోనే స్టంటులలో అడ్డంకులను గమనించిన డాక్టర్ ప్రతీక్.. రోగి ప్రాణాపాయ స్థితిని అంచనా వేశారు. దీంతో రోగికి నాలుగు రెట్ల క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. వెంటనే డాక్టర్ ప్రతీక్ నిపుణులైన వైద్య బృందంతో కలిసి రోగికి ఆ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఎలాంటి కాలు కోతలు, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. సర్జరీ అనంతరం 36 గంటల్లోనే రోగి నడవగలగడమే కాక మెట్లను సైతం ఎక్కే శక్తిని పొందారు. ఈ క్రమంలో వైద్యులు రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ మాట్లాడుతూ, ద్వైపాక్షిక అంతర్గత క్షీరథ ధమని (బీఐఎంఏ) సాంకేతికత ఉపయోగించి చేసే మొత్తం ధమనుల కరోనరీ బైపాస్ శస్త్ర చికిత్స.. కరోనరీ ఆర్టరీ అడ్డంకులు ఉన్న రోగులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ప్రామాణిక కరోనరీ బైపాస్ సర్జరీలో బీఐఎంఏ సాంకేతికతతో నిర్వహించే ఈ విధానం వల్ల ప్రమాదం 1 శాతం కంటే తక్కువ అన్నారు. ఈ విధానం ఉత్తమమైనదని, రోగులు భయపడకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. రోగి హేమంత్ మాట్లాడుతూ ప్రస్తుత ఆరోగ్య స్థితి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కేర్ ఆస్పత్రిని ఎంచుకొని మంచి పని చేశారని అన్నారు. కేర్ ఆస్పత్రి హెచ్ సి ఓ ఓ నీలేష్ గుప్తా మాట్లాడుతూ, తమ ఆసుపత్రి ద్వారా అధునాతన సాంకేతికత కలిగిన శస్త్ర చికిత్సలను రోగులకు చేరువచేశామన్నారు. మా తరపున రోగులకు నాణ్యమైన వైద్య సంరక్షణ అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు
- Tags
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..