Petrol-Diesel: పెట్రోల్, డీజిల్పై కేంద్రం కీలక ప్రకటన
- చక్కబడుతున్న అంతర్జాతీయ పరిస్థితులు
- అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం
- దేశంలో పెట్రోల్, డీజిల్ లభ్యతపై కేంద్రం కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. మళ్లీ నార్మల్ స్థితికి వచ్చేలా కనిపిస్తున్నాయి. దాదాపు పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు వచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇప్పటికే డీజిటల్ సంతకాలు అయిపోయాయి. ఇక ఇరుపక్షాలు సమావేశమై అధికారికంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు మళ్లీ పరిస్థితులు నార్మల్ స్థితికి రానున్నాయి.
ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దేశంలోని ఇంధన సరఫరా పరిస్థితిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఇంధన పరిస్థితి స్థిరంగా ఉందని.. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల సమయంలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో అమ్మకాలు భారీగా పెరిగిన విషయంపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ మాట్లాడుతూ.. వాణిజ్య వినియోగదారులు తమ అవసరాల కోసం రిటైల్ అవుట్లెట్లను ఆశ్రయించడం వల్ల కొన్ని బంకుల్లో అమ్మకాలు అధికంగా నమోదయ్యాయని తెలిపారు. “సుమారు 42 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం రిటైల్ అవుట్లెట్లకు మళ్లింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు పెరిగాయి. అయితే దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
Also Read
- Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
- Women Financial Assistance: మహిళలకు గుడ్ న్యూస్.. ఇక, నెలకు రూ.2,500.. అర్హతలు ఇవే..
- Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల 'యశ్వన్'.!
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
200 లీటర్ల పరిమితి ఎందుకు?
డీజిల్ నిల్వలు చేసి బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మోటార్ స్పిరిట్ అండ్ హై-స్పీడ్ డీజిల్ (టెంపరరీ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై త్రూ రిటైల్ అవుట్లెట్స్) ఆర్డర్-2026’ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒక వ్యక్తికి గరిష్టంగా 200 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం విక్రయించాలి. ఈ నిబంధన తాత్కాలికంగా 90 రోజుల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ ఉత్తర్వు ప్రజలకు ఇంధనం సులభంగా అందుబాటులో ఉండేలా చేయడానికే తీసుకొచ్చామని.. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా కాదని సుజాతా శర్మ పేర్కొన్నారు.
వినియోగదారులకు ఇబ్బంది లేదు
కేంద్రం ప్రకారం ఈ కొత్త నిబంధనలు సాధారణ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపవు. సాధారణంగా కారు లేదా ద్విచక్ర వాహనం ఉపయోగించే వ్యక్తికి 200 లీటర్ల పరిమితి చాలా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2026 మే నెల గణాంకాల ప్రకారం.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల (PSU OMCs) రిటైల్ అవుట్లెట్లలో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. రిటైల్ అవుట్లెట్ల దగ్గర తాత్కాలిక సరఫరా సమస్యల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని మరోసారి స్పష్టం చేసింది.
- Tags
- diesel
- india
- Oil Ministry
- petrol
తాజావార్తలు
-
Cricket Player: తీవ్ర విషాదం.. అరుదైన వ్యాధితో మరణించిన క్రికెటర్..
-
Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
-
Syria: సిరియా పర్యటనలో మాక్రాన్కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
-
Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్లోనే అలా!
-
Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!