Food Poison: ఆశ్రమంలో భోజనం వికటించి ముగ్గురు మృతి.. మరో 15మందికి అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Poison: రాజస్థాన్లోని కోటాలో గల అప్నా ఘర్ ఆశ్రమంలో కలుషిత ఆహారం కారణంగా ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో 15 మంది ఆసుపత్రి పాలైనట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఇవాళ ఉదయం కొందరు నిద్ర లేవకపోవడంతో, మరికొందరు వాంతులు చేసుకోగా వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
“ఆదివారం సాయంత్రం కొన్ని ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు వ్యక్తులు మరణించారు. సుమారు 15 మందిని ముందుజాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నారు. వైద్య బృందం అక్కడే ఉంది. అలాగే విచారణ కోసం ఆహారం, నీటి నమూనాలను సేకరిస్తున్నారు. బోర్వెల్ నీరే కారణమని భావిస్తున్నాం.” అని జిల్లా కలెక్టర్ ఓం ప్రకాష్ బంకర్ అన్నారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
Trainee aircraft crash: వ్యవసాయ క్షేత్రంలో కూలిన ట్రైనీ విమానం.. పైలట్ సేఫ్
15 మంది ఆరోగ్య పరిస్థితి గురించి వైద్య పరీక్షలు చేస్తున్నామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ భూపేందర్ సింగ్ తోమర్ వెల్లడించారు. వారికి పలు వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులను ఆదేశించామన్నారు. బోర్వెల్ నీటిని తాగిన వ్యక్తుల ఆరోగ్యమే తీవ్రంగా దెబ్బతిందని.. ఫుడ్ పాయిజనింగ్ నీటి ద్వారా సంక్రమించిందని తాము భావిస్తున్నాన్నట్లు ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!