Citizenship: పాస్పోర్టు ఉంటే పౌరసత్వం ఉన్నట్లు కాదు: కేంద్రం..
- పాస్పోర్ట్ పౌరసత్వానికి తుది రుజువు కాదని కేంద్రం స్పష్టీకరణ.
- భారత పౌరులకే పాస్పోర్ట్ జారీ చేసినా అది ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే.
- ఆధార్, ఓటర్ ఐడీ కూడా పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు కావని ఇప్పటికే స్పష్టత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పౌరసత్వం, పాస్పోర్టు సంబంధాలను కేంద్రం ప్రభుత్వం క్లియర్గా వివరించింది. భారత పౌరులకే పాస్పోర్టు జారీ అవుతున్నప్పటికీ, అది పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రం కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. 14వ పాస్పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.పాస్పోర్టు ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని తెలిపింది. పాస్పోర్టు కలిగి ఉండటం వల్ల ఒక వ్యక్తి భారత పౌరుడని నిర్ధారించలేమని పేర్కొంది. అయితే, భారత పాస్పోర్టు మాత్రం భారతీయులకే వర్తిస్తుందని చెప్పింది.
ఇటీవల ఓటర్ జాబితా ప్రక్షాళన కోసం చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆధార్ కార్డ్ మాత్రమే దేశ పౌరసత్వానికి రుజువు కాదని చెప్పింది. ఆధార్ కార్డ్ కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే అని స్పష్టం చేసింది. ఇదే విధంగా ఓటర్ ఐడీ కార్డ్ కూడా పౌరసత్వాన్ని నిరూపించే పత్రం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
భారత పౌరసత్వ చట్టాల ప్రకారం, ఒక వ్యక్తి జనవరి 26, 1950న లేదా ఆ తర్వాత, కానీ జూలై 1, 1987కి ముందు దేశంలో జన్మించి ఉంటే, వారు పుట్టుకతోనే భారతీయులుగా పరిగణించబడతారు.ఇక జూలై 1987 తర్వాత జన్మించిన వారి విషయానికొస్తే, వారి తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు పౌరులై ఉంటే, వారు పౌరసత్వాన్ని పొందవచ్చు. డిసెంబర్ 3, 2004న లేదా ఆ తర్వాత జన్మించిన వారు పౌరసత్వాన్ని పొందాలంటే, వారి తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయులై ఉండాలి,లేదా తల్లిదండ్రులలో ఒకరు భారత పౌరులై ఉండి, మరొకరు జనన సమయంలో అక్రమ వలసదారుగా ఉండకూడదు.
దేశంలో పాస్పోర్ట్ సేవలు గణనీయంగా విస్తరించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. 2025లో మొత్తం 1.5 కోట్ల పాస్పోర్టులు, సంబంధిత సేవలు అందించగా, వీటిలో మ1.39 కోట్ల పాస్పోర్టులు జారీ అయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 545 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. పదేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 77గా మాత్రమే ఉండేది. పోలీస్ వెరిఫికేషన్ మినహాయిస్తే ప్రస్తుతం 6 వర్కింగ్ డేస్లోనే పాస్పోర్ట్ జారీ అవుతోంది. పాస్పోర్టు కేంద్రాల్లో పౌరుడు గడిపే సమయం కూడా 45 నిమిషాలకు తగ్గిందని వెల్లడించింది.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!