Delhi: పర్వేష్ వర్మ.. మరో ఏక్నాథ్ షిండే అవుతాడా? ఆ ఛాన్సుందా?
- అసంతృప్తిగా పర్వేష్ వర్మ మద్దతుదారులు
- పర్వేష్ వర్మ.. మరో ఏక్నాథ్ షిండే అవుతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని మీడియా కోడైకూసింది. కానీ చివరికి రేఖా గుప్తాను అదృష్టం వరించి సీఎం పోస్టు తన్నుకుపోయారు. ఆర్ఎస్ఎస్తో ఆమెకు మంచి సంబంధాలు ఉండడంతోనే సీఎం పదవి ఆమెకు దక్కిందని వార్తలు వినిపిస్తు్న్నాయి. అయితే సీఎం పదవి దక్కలేదన్న అసంతృప్తి.. పర్వేష్ వర్మ, ఆయన మద్దతుదారులకు ఉన్నట్లు సమాచారం. చాలా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన.. మరో ఏక్నాథ్ షిండే కావొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీకి 48, ఆప్కు 22 స్థానాలు దక్కాయి. ప్రభుత్వానికి కావాల్సింది 35 సీట్లు ఉంటే సరిపోతుంది.
ఇది కూడా చదవండి: Phone Tapping Case: “హరీష్ రావు పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేశారు”.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్..
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి రాజకీయ ఉద్దండును పర్వేష్ వర్మ ఓడించారు. ‘జెయింట్ కిల్లర్’గా వర్మకు పేరుంది. అలాంటిది ఆయనకు సీఎం పదవి దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతేడాది మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఏక్నాథ్ షిండే వర్గం ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించింది. కానీ బీజేపీనే ఎక్కువ సీట్లు సాధించింది. దీంతో కాషాయ పార్టీ సీఎం పోస్టును ఇతరులకు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. దీంతో చాలా రోజులు పంచాయితీ జరిగింది. చివరికి దేవేంద్ర ఫడ్నవిస్కు ముఖ్యమంత్రి పదవి దక్కింది. మొత్తానికి ఏక్నాథ్ షిండే మెత్తబడి.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: అన్ని రంగాల్లో కొత్త నాయకత్వం రావాలి.. కాన్క్లేవ్ సదస్సులో మోడీ పిలుపు
తాజాగా ఢిల్లీలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. పర్వేష్ వర్మ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ హైకమాండ్ చివరికి రేఖా గుప్తా వైపు మొగ్గు చూపింది. అయితే పర్వేష్ వర్మ.. భవిష్యత్లోఏక్నాథ్ షిండేలా చేసే పరిస్థితులు లేవని తెలుస్తోంది. అధిష్టానం చెప్పినట్లుగానే వెళ్లొచ్చని సమాచారం.
ఇక పర్వేష్ వర్మకు మంచి మంత్రి పదవినే కట్టబెట్టింది. మేనిఫెస్టో హామీలు నెరవేర్చే విధంగా కీలక పోస్టు అప్పగించింది. ఇక ముఖ్యమంత్రి రేఖా గుప్తా కంటే వర్మ చిన్నవాడే. ప్రస్తుతం ఆయన వయసు (47). ఇక వర్మ క్రమశిక్షణ నాయకుడిగా పేరుంది. కనుక రేఖా గుప్తాతో కలిసి వెళ్లొచ్చని తెలుస్తోంది. భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Return of the Dragon Review: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ ఇంకో హిట్ కొట్టాడా ?
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!