Delhi: పర్వేష్ వర్మ.. మరో ఏక్నాథ్ షిండే అవుతాడా? ఆ ఛాన్సుందా?
- అసంతృప్తిగా పర్వేష్ వర్మ మద్దతుదారులు
- పర్వేష్ వర్మ.. మరో ఏక్నాథ్ షిండే అవుతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని మీడియా కోడైకూసింది. కానీ చివరికి రేఖా గుప్తాను అదృష్టం వరించి సీఎం పోస్టు తన్నుకుపోయారు. ఆర్ఎస్ఎస్తో ఆమెకు మంచి సంబంధాలు ఉండడంతోనే సీఎం పదవి ఆమెకు దక్కిందని వార్తలు వినిపిస్తు్న్నాయి. అయితే సీఎం పదవి దక్కలేదన్న అసంతృప్తి.. పర్వేష్ వర్మ, ఆయన మద్దతుదారులకు ఉన్నట్లు సమాచారం. చాలా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన.. మరో ఏక్నాథ్ షిండే కావొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీకి 48, ఆప్కు 22 స్థానాలు దక్కాయి. ప్రభుత్వానికి కావాల్సింది 35 సీట్లు ఉంటే సరిపోతుంది.
ఇది కూడా చదవండి: Phone Tapping Case: “హరీష్ రావు పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేశారు”.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్..
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి రాజకీయ ఉద్దండును పర్వేష్ వర్మ ఓడించారు. ‘జెయింట్ కిల్లర్’గా వర్మకు పేరుంది. అలాంటిది ఆయనకు సీఎం పదవి దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతేడాది మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఏక్నాథ్ షిండే వర్గం ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించింది. కానీ బీజేపీనే ఎక్కువ సీట్లు సాధించింది. దీంతో కాషాయ పార్టీ సీఎం పోస్టును ఇతరులకు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. దీంతో చాలా రోజులు పంచాయితీ జరిగింది. చివరికి దేవేంద్ర ఫడ్నవిస్కు ముఖ్యమంత్రి పదవి దక్కింది. మొత్తానికి ఏక్నాథ్ షిండే మెత్తబడి.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: అన్ని రంగాల్లో కొత్త నాయకత్వం రావాలి.. కాన్క్లేవ్ సదస్సులో మోడీ పిలుపు
తాజాగా ఢిల్లీలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. పర్వేష్ వర్మ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ హైకమాండ్ చివరికి రేఖా గుప్తా వైపు మొగ్గు చూపింది. అయితే పర్వేష్ వర్మ.. భవిష్యత్లోఏక్నాథ్ షిండేలా చేసే పరిస్థితులు లేవని తెలుస్తోంది. అధిష్టానం చెప్పినట్లుగానే వెళ్లొచ్చని సమాచారం.
ఇక పర్వేష్ వర్మకు మంచి మంత్రి పదవినే కట్టబెట్టింది. మేనిఫెస్టో హామీలు నెరవేర్చే విధంగా కీలక పోస్టు అప్పగించింది. ఇక ముఖ్యమంత్రి రేఖా గుప్తా కంటే వర్మ చిన్నవాడే. ప్రస్తుతం ఆయన వయసు (47). ఇక వర్మ క్రమశిక్షణ నాయకుడిగా పేరుంది. కనుక రేఖా గుప్తాతో కలిసి వెళ్లొచ్చని తెలుస్తోంది. భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Return of the Dragon Review: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ ఇంకో హిట్ కొట్టాడా ?
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!