Parliament Monsoon Session: పార్లమెంట్లో నీట్ అవకతవకలపై రగడ.. విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా స్లొగన్స్
- పార్లమెంట్లో నీట్ పేపర్ లీకేజీపై కొనసాగుతున్న రగడ..
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి వ్యతిరేకంగా నినాదాలు..
- మోడీ ప్రభుత్వంలో విద్యార్థులకు న్యాయం జరగదు: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session: కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు నేటి నుంచి బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్- యూజీ పేపర్ లీకేజీ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ అంశంపై మాట్లాడుతుండగా.. విపక్షాలు నిరసన తెలిపాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీల నినాదాలతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు, ఈ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమంటూ ఆరోపించారు. ఈ పేపర్ లీక్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరిపై నిందలు వేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Gambhir-Jadeja: జడేజా అత్యంత కీలక ప్లేయర్.. అతడిని జట్టు నుంచి తప్పించలేదు: గంభీర్
Also Read
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
అయితే, ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా పేపర్ లీక్ జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు.. ఎన్టీఏ ఇప్పటి వరకు 240 పరీక్షలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది.. ప్రస్తుతం నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుందన్నారు. కాగా, మోడీ ప్రభుత్వం పేపర్ లీక్ల విషయంలో రికార్డు సృష్టిస్తుందని సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత కాలం స్టూడెంట్స్ కు న్యాయం దక్కదు అని అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. ఇదిలాఉంటే.. కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన రూల్స్ ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసులను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తిరస్కరించారు.
తాజావార్తలు
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
-
Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!