Parliament Monsoon Session: పార్లమెంట్లో నీట్ అవకతవకలపై రగడ.. విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా స్లొగన్స్
- పార్లమెంట్లో నీట్ పేపర్ లీకేజీపై కొనసాగుతున్న రగడ..
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి వ్యతిరేకంగా నినాదాలు..
- మోడీ ప్రభుత్వంలో విద్యార్థులకు న్యాయం జరగదు: రాహుల్ గాంధీ
Parliament Monsoon Session: కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు నేటి నుంచి బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్- యూజీ పేపర్ లీకేజీ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ అంశంపై మాట్లాడుతుండగా.. విపక్షాలు నిరసన తెలిపాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీల నినాదాలతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు, ఈ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమంటూ ఆరోపించారు. ఈ పేపర్ లీక్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరిపై నిందలు వేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Gambhir-Jadeja: జడేజా అత్యంత కీలక ప్లేయర్.. అతడిని జట్టు నుంచి తప్పించలేదు: గంభీర్
Also Read
- New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
- Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
- Nitin Gadkari: "కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్".. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!
- NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
అయితే, ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా పేపర్ లీక్ జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు.. ఎన్టీఏ ఇప్పటి వరకు 240 పరీక్షలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది.. ప్రస్తుతం నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుందన్నారు. కాగా, మోడీ ప్రభుత్వం పేపర్ లీక్ల విషయంలో రికార్డు సృష్టిస్తుందని సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత కాలం స్టూడెంట్స్ కు న్యాయం దక్కదు అని అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. ఇదిలాఉంటే.. కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన రూల్స్ ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసులను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తిరస్కరించారు.
తాజావార్తలు
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
-
New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!