PM Modi: ప్రధాని మోడీ కాళ్లకు నమస్కరించిన ఆ దేశ ప్రధాని.. సంప్రదాయాన్ని పక్కకు పెట్టి ఘనస్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ జాపాన్ లో జీ-20 సమావేశం ముగిసిన తర్వాత ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపిఐసి) కోసం ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఈ దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా మోడీ రికార్డుకెక్కారు. భారత ప్రధానికి అక్కడి ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఆయన పాదాలకు నమస్కరించారు. అందుకు ప్రతిగా మోడీ, జేమ్స్ మరాపేను కౌగిలించుకున్నారు. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత దేశాన్ని సందర్శించే ఏ నాయకుడికి న్యూ గినియా సాధారణంగా స్వాగతసత్కారాలు ఇవ్వదు. అయితే ప్రధాని మోడీకి అందుకు మినహాయింపు ఇచ్చారు.
Read Also: Uttarakhand: మారుపేరుతో పరిచయం.. హిందూ యువతిపై అత్యాచారం.. వీడియోలతో బ్లాక్మెయిల్
Also Read
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (FIPIC) యొక్క మూడవ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోడీకి జేమ్స్ మరాపే సోమవారం ఆతిథ్యం ఇవ్వనున్నారు. జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతోపాటు పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో కూడా మోడీ భేటీ కానున్నారు.ఈ సమావేశానికి హాజరుకావడానికి 14 ఫసిఫిక్ ద్వీపదేశాలు సమ్మతించినందుకు మోడీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. FIPIC సమ్మిట్లో 14 దేశాల నాయకులు పాల్గొంటారు. అంతకుముందు ఈ 14 దేశాల్లో ఒకటైన ఫిజీలో 2014లో చివరిసారిగా ప్రధాని పర్యటించారు.
ఈ 14 పసిఫిక్ దేశాల్లో కుక్ దీవులు, ఫిజీ, కిరిబాటి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నౌరు, నియు, పలావు, పాపువా న్యూ గినియా, సమోవా, సోలమన్ దీవులు, టోంగా, తువాలు మరియు వనాటు ఉన్నాయి.
#WATCH | Prime Minister of Papua New Guinea James Marape seeks blessings of Prime Minister Narendra Modi upon latter's arrival in Papua New Guinea. pic.twitter.com/gteYoE9QOm
— ANI (@ANI) May 21, 2023
Prime Minister Narendra Modi accorded the Guard of Honour at Port Moresby in Papua New Guinea. pic.twitter.com/TfmhG9dTKG
— ANI (@ANI) May 21, 2023
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!