Chandigarh: పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీఛార్జ్
- పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత
- విద్యార్థులపై లాఠీఛార్జ్.. ఐదుగురికి గాయాలు
- పీయూ సెనేట్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొన్న కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాంపస్లో ‘పంజాబ్ విజన్ 2047’ కాన్క్లేవ్ కార్యక్రమం జరుగుతోంది. సీఎం భగవంత్ మాన్ ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకుని ఆందోళణ చేపట్టారు. పీయూ సెనేట్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థులపై ఒక్కసారిగా చండీగఢ్ పోలీసులు విరుచుకుపడ్డారు. విద్యార్థి, విద్యార్థినులపై లాఠీఛార్జ్ చేశారు.
ఇది కూడా చదవండి: Chandigarh: పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీఛార్జ్
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
యూనివర్శిటీ లా ఆడిటోరియంలో ఆప్ ఎంపీ విక్రమ్ సాహ్నీ నిర్వహించిన విజన్ పంజాబ్ 2047 కార్యక్రమానికి సీఎం భగవంత్ మాన్, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, వీసీ రేణు విజ్, తదితరులు పాల్గొన్నారు. క్యాంపస్లో పంజాబ్ సీఎం మన్ ప్రసంగిస్తుండగా సెనేట్ ఎన్నికలు నిర్వహించాలంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం విద్యార్థులపై లాఠీ జుళిపించారు. విద్యార్థులకు రక్తస్రావం జరిగింది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇది కూడా చదవండి: Retiring Room In Railways: రైల్వే స్టేషన్లోని రిటైరింగ్ రూమ్లు ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
సెనేట్ ఎన్నికలు ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారు. ‘పంజాబ్ యూనివర్శిటీ బచావో మోర్చా’ బ్యానర్తో విద్యార్థులు తరలివచ్చారు. క్యాంపస్లో మార్చ్ను నిర్వహించారు. ముఖ్యమంత్రి మాన్ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఆడిటోరియం సమీపంలోకి చేరుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆడిటోరియం దగ్గరకు వచ్చేందుకు స్టూడెంట్స్ అనుమతి తీసుకోలేదని.. ఆడిటోరియం చుట్టూ బారికేడ్లు వేయకపోవడం వల్ల విద్యార్థులను లోపలికి వెళ్లకుండా ఆపవలిసి వచ్చిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటన అనంతరం భారతీయ కిసాన్ యూనియన్ (క్రాంతికారి) సభ్యులు… ఆందోళనకారులతో కలిసి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. నిరసనకారులను అదుపులోకి తీసుకోలేదు.
Chandigarh Police resorted to a lathicharge on peacefully protesting Panjab University students demanding PU Senate elections. The protest took place near the Vision Punjab 2047 event organized by AAP MP Vikram Sawhney in the university’s Law Auditorium, where CM Bhagwant Mann,… pic.twitter.com/MmJdZMAvfa
— Gagandeep Singh (@Gagan4344) November 13, 2024
తాజావార్తలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
-
Peddi : చరణ్ ‘పెద్ది’ కోసం రంగంలోకి బాలయ్య..!
-
Xiaomi 17 Max: 8000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో.. షియోమీ 17 మ్యాక్స్ విడుదల
-
Sai Abhyankar: ట్రోల్స్ను ట్రెండ్గా మార్చిన సాయి అభ్యంకర్..
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!