Palitana: దేశంలో పూర్తి “శాకాహార నగరం”గా గుర్తింపు.. మాంసాహరం నిషేధానికి కారణం ఏంటీ..?
- దేశంలో పూర్తి "శాకాహార నగరం" గుర్తింపు..
- మాంసాహారాన్ని నిషేధించిన పాలిటానా పట్టణం..
- నిషేధానికి కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palitana: ప్రపంచంలోనే భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లకు భారతదేశం కేంద్రం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా ఆచార వ్యవహారాలు ఉంటాయి. అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆహార నియమాలు, అలవాట్లు ఉంటాయి. ప్రపంచ అట్లాస్ నివేదిక ప్రకారం, భారత్లో ప్రపంచంలోనే అత్యధిక శాకాహారులు ఉన్న దేశంగా నిలిచింది. దేశంలో 38 శాతం మంది శాకాహారులు ఉన్నారు. ఇదిలా ఉంటే, దేశంలోనే పూర్తి ‘‘శాకాహార’’ నగరంగా గుజరాత్ లోని ‘పాలిటానా’ రికార్డుకెక్కింది. ఈ పట్టణంలో పూర్తిగా మాంసాహారం నిషేధం. ఈ పట్టణం గుజరాత్లోని భావ్ నగర్ జిల్లాలో ఉంది. మాంసం, గుడ్లతో పాటు మాంసాహారం ఈ పట్టణంలో పూర్తిగా నిషేధం.
Read Also: London: భారత్ లో చిన్నపాటి వర్షాలకే రోడ్లు జలమయం..లండన్ లో ఇలా ఎందుకు జరగదు?
Also Read
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
ఈ ప్రాంతంలో జైన సన్యాసులు మాంసాహార నిషేధం కోసం పెద్ద ఉద్యమమే చేశారు. 2014లో, ఈ ప్రాంతంలో దాదాపుగా 250 మాంసం దుకాణాలనున మూసేయాలని కోరుతూ 200 మంది సన్యాసులు నిరాహారదీక్ష చేశారు. జైన మతస్తుల మనోభావాలను గౌరవించేందు ఈ ప్రాంతంలో మాంసం, గుడ్లు, జంతువులను వధించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇవి ఉల్లంఘిస్తే భారీ జరిమానాలను విధిస్తుంది.
ఆలయాల నగరంలో పాలిటానాకు పేరుంది. ఇక్కడి త్రుంజయ కొండపై 900 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతున్న 800 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. పాలిటానాలో లభించే ఆహారం పూర్తిగా జైన వంటకాల నుంచి ప్రేరణ పొందింది. జైన వంటకాల్లో కొన్ని కూరగాయలను కూడా మినహాయిస్తారు. పాలిటానాలో సులువుగా దొరికే ప్రసిద్ధ వంటకాలలో ధోక్లా, ఖాండ్వీ, గతియా మరియు కధి ఉన్నాయి. ప్రజలు మిల్లెట్స్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తృణధాన్యాలు, బెల్లం, నెయ్యి ఉపయోగించి ‘రోట్లో’ అనే పదార్థాన్ని తయారు చేస్తారు.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!