Pakistan Woman: “సార్, నాకు న్యాయం చేయండి”.. ప్రధాని మోడీకి పాకిస్తాన్ మహిళ విజ్ఞప్తి
- సార్ నాకు న్యాయం చేయాలి..
- ప్రధాని మోడీకి పాకిస్తాన్ మహిళ అభ్యర్థన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Woman: ‘‘మోడీ గారు మీరే నాకు న్యాయం చేయాలి’’ అని ప్రధాని నరేంద్రమోడీని పాకిస్తాన్కు చెందిన ఒక మహిళ కోరుతోంది. తన భర్త తనను మోసం చేసి, ఢిల్లీలో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. పాకిస్తాన్ కరాచీకి చెందిన నికితా నాగ్దేశ్ అనే మహిళ ప్రధాని మోడీకి వీడియో అప్పీల్ చేసింది. నికితాకు హిందూ సంప్రదాయం ప్రకారం, జనవరి 26, 2020న కరాచీలో విక్రమ్ నాగ్దేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పాకిస్తాన్ సంతతికి చెందిన విక్రమ్ దీర్ఘకాలిక వీసాపై ఇండోర్లో నివసిస్తున్నాడు. పెళ్లి జరిగిన ఒక నెల తర్వాత, ఫిబ్రవరిలో తనను ఇండియా తీసుకువచ్చాడని, కానీ నెల రోజుల్లోనే తన జీవితం తలకిందులైందని నికితా వీడియోలో చెప్పింది.
వీసా సమస్యలు ఉన్నాయని చెబుతూ జూలై 09, 2020న తనను అట్టారి సరిహద్దు గుండా పాకిస్తాన్కు పంపించాడని, అప్పటి నుంచి తనను మళ్లీ ఇండియా తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం లేదని నికితా ఆరోపించింది. తనను భారత్ తీసుకువెళ్లాలని అభ్యర్థిస్తున్నప్పటికీ, విక్రమ్ నిరాకరిస్తూనే ఉన్నాడని చెప్పింది. తనకు న్యాయం చేయకపోతే, మహిళలకు న్యాయంపై నమ్మకం పోతుందని ఆమె అన్నారు. చాలా మంది అమ్మాయిలు గృహహింసకు బలవుతున్నారని ఆమె భాగోద్వేగానికి గురవుతోందని చెప్పారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
READ ALSO: Tata Sierra Prices: టాటా సియెర్రా వేరియంట్ల వారిగా ధరలు ఇవే..
తన భర్తకు వారి బంధువుల్లో ఒక అమ్మాయితో సంబంధం ఉందని, ఈ విషయాన్ని తన మామకు చెబితే వివాహేతర సంబంధాల గురించి ఏం చేయలేమని చెప్పారని నికితా ఆరోపించింది. కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో తనను బలవంతంగా పాకిస్తాన్ పంపించాడని, ఇప్పుడు భారత్ రావడాన్ని అడ్డుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. ఇప్పుడు తన భర్త ఢిల్లీ మహిళతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె ఆరోపించింది.
దీనిపై జనవరి 2025లో నికితా ఫిర్యాదు చేసింది. ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టు అధికార పరిధిలోని సింధీ పంచ్ మీడియేషన్ అండ్ లీగల్ కౌన్సిల్ సెంటర్ ముందుకు వచ్చింది. విక్రమ్తో పాటు అతడికి కాబోయే భార్యకు నోటీసులు జారీ అయ్యాయి. భార్యభర్తలు భారతీయ పౌరులు కానందున ఇది పాకిస్తాన్ అధికార పరిధిలోకి వస్తుందని, విక్రమ్ను పాకిస్తాన్కు బహిష్కరించాలని సిఫారసు చేసింది. మే 2025లో నికితా ఇండోర్ సామాజిక పంచాయతీని సంప్రదించింది. ఇది కూడా విక్రమ్ను పాకిస్తాన్కు బహిష్కరించాలని ఆదేశించింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ చెప్పారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..