Pakistan Woman: “సార్, నాకు న్యాయం చేయండి”.. ప్రధాని మోడీకి పాకిస్తాన్ మహిళ విజ్ఞప్తి
- సార్ నాకు న్యాయం చేయాలి..
- ప్రధాని మోడీకి పాకిస్తాన్ మహిళ అభ్యర్థన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Woman: ‘‘మోడీ గారు మీరే నాకు న్యాయం చేయాలి’’ అని ప్రధాని నరేంద్రమోడీని పాకిస్తాన్కు చెందిన ఒక మహిళ కోరుతోంది. తన భర్త తనను మోసం చేసి, ఢిల్లీలో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. పాకిస్తాన్ కరాచీకి చెందిన నికితా నాగ్దేశ్ అనే మహిళ ప్రధాని మోడీకి వీడియో అప్పీల్ చేసింది. నికితాకు హిందూ సంప్రదాయం ప్రకారం, జనవరి 26, 2020న కరాచీలో విక్రమ్ నాగ్దేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పాకిస్తాన్ సంతతికి చెందిన విక్రమ్ దీర్ఘకాలిక వీసాపై ఇండోర్లో నివసిస్తున్నాడు. పెళ్లి జరిగిన ఒక నెల తర్వాత, ఫిబ్రవరిలో తనను ఇండియా తీసుకువచ్చాడని, కానీ నెల రోజుల్లోనే తన జీవితం తలకిందులైందని నికితా వీడియోలో చెప్పింది.
వీసా సమస్యలు ఉన్నాయని చెబుతూ జూలై 09, 2020న తనను అట్టారి సరిహద్దు గుండా పాకిస్తాన్కు పంపించాడని, అప్పటి నుంచి తనను మళ్లీ ఇండియా తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం లేదని నికితా ఆరోపించింది. తనను భారత్ తీసుకువెళ్లాలని అభ్యర్థిస్తున్నప్పటికీ, విక్రమ్ నిరాకరిస్తూనే ఉన్నాడని చెప్పింది. తనకు న్యాయం చేయకపోతే, మహిళలకు న్యాయంపై నమ్మకం పోతుందని ఆమె అన్నారు. చాలా మంది అమ్మాయిలు గృహహింసకు బలవుతున్నారని ఆమె భాగోద్వేగానికి గురవుతోందని చెప్పారు.
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
READ ALSO: Tata Sierra Prices: టాటా సియెర్రా వేరియంట్ల వారిగా ధరలు ఇవే..
తన భర్తకు వారి బంధువుల్లో ఒక అమ్మాయితో సంబంధం ఉందని, ఈ విషయాన్ని తన మామకు చెబితే వివాహేతర సంబంధాల గురించి ఏం చేయలేమని చెప్పారని నికితా ఆరోపించింది. కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో తనను బలవంతంగా పాకిస్తాన్ పంపించాడని, ఇప్పుడు భారత్ రావడాన్ని అడ్డుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. ఇప్పుడు తన భర్త ఢిల్లీ మహిళతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె ఆరోపించింది.
దీనిపై జనవరి 2025లో నికితా ఫిర్యాదు చేసింది. ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టు అధికార పరిధిలోని సింధీ పంచ్ మీడియేషన్ అండ్ లీగల్ కౌన్సిల్ సెంటర్ ముందుకు వచ్చింది. విక్రమ్తో పాటు అతడికి కాబోయే భార్యకు నోటీసులు జారీ అయ్యాయి. భార్యభర్తలు భారతీయ పౌరులు కానందున ఇది పాకిస్తాన్ అధికార పరిధిలోకి వస్తుందని, విక్రమ్ను పాకిస్తాన్కు బహిష్కరించాలని సిఫారసు చేసింది. మే 2025లో నికితా ఇండోర్ సామాజిక పంచాయతీని సంప్రదించింది. ఇది కూడా విక్రమ్ను పాకిస్తాన్కు బహిష్కరించాలని ఆదేశించింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ చెప్పారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!