Pakistan: అవును, భారత్ మా ఎయిర్ బేస్లపై క్షిపణి దాడి చేసింది: పాకిస్తాన్ డిప్యూటీ పీఎం..
- భారత్ మా వైమానిక స్థావరాలపై దాడి చేసింది..
- ఒప్పుకున్న పాకిస్తాన్ డిప్యూటీ పీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన రాజకీయ నేతలు తప్పుడు కథనాలను చెబుతూనే వస్తున్నారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించిందంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పాడు. మరోవైపు, పాక్ వ్యాప్తంగా విక్టరీ ర్యాలీలు తీస్తున్నారు. ఈ ర్యాలీల్లో మాజీ క్రికెటర్ ఆఫ్రిదితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ ఓ వైపు క్లియర్గా శాటిలైట్ చిత్రాలతో పాకిస్తాన్కి జరిగిన నష్టాన్ని చూపిస్తుంటే, మరోవైపు తమకు ఏ కాలేదు, భారత్ తీవ్రంగా నష్టపోయిందని ఒక ఫేక్ ప్రచారాన్ని పాకిస్తాన్ చేస్తోంది.
Read Also: PM Modi: ఎస్-400 ముందు ప్రధాని మోడీ.. పాక్, చైనా చెప్పిందంతా అబద్ధమే అని తేలింది..
Also Read
- Supreme Court: సె*క్స్ వర్కర్ల హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చారిత్రాత్మక మార్గదర్శకాలు..
- Hamirpur: కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఆరుగురు మృతి.!
- SIR Explained: ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగించారా? ఇకపై మీరు భారతీయులు కాదా?
- RBI New Currency Notes: ఆర్బీఐ సంచలన ప్లాన్..? పాత కరెన్సీ నోట్లు బ్యాన్..!?
ఇదెలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సోమవారం మాట్లాడుతూ.. భారత్ తమ 11 వైమానిక స్థావరాలపై క్షిపణి దాడి చేసినట్లు అంగీకరించారు. భారతదేశంతో జరిగిన ఘర్షణల్లో పాకిస్తాన్ విమానాలు దెబ్బతిన్నట్లు చెప్పాడు. పాకిస్తాన్ జెట్ని భారత్ కూల్చినట్లు స్పష్టమైన ఆధారాలతో వెల్లడించింది. అయితే, ఇషాక్ దార్ మాత్రం తమ జెట్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు అంగీకరించారు. భారత పైలట్ ఎవరూ కూడా పాకిస్తాన్ వద్ద లేరని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని చాలా కీలమైన ఎయిర్ బేస్లపై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. శనివారం తెల్లవారుజామున రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో సహా సర్గోదా, రఫికీ, జకోబాబాద్, స్కర్దు వంటి ఎయిర్ బేస్లపై విరుకుపడింది. మొత్తంగా భారత్ పాక్కి చెందిన 11 వైమానిక స్థావరాలను దెబ్బతీసింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత 35-40 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది మరణించినట్లు భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
టెస్లా లవర్స్కి గుడ్ న్యూస్.. రూ.9 లక్షల తగ్గింపుతో మార్కెట్లోకి సరికొత్త Tesla Model Y మోడల్.. ఫీచర్స్ అదుర్స్!!
-
Supreme Court: సె*క్స్ వర్కర్ల హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చారిత్రాత్మక మార్గదర్శకాలు..
-
Hamirpur: కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఆరుగురు మృతి.!
-
Hardik Pandya: “ముంబై ఫ్లాప్ షో వెనుక అసలు కథ బట్టబయలు”.. కెప్టెన్ హార్దిక్కు మేనేజ్మెంట్ బిగ్ షాక్..
-
SIR Explained: ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగించారా? ఇకపై మీరు భారతీయులు కాదా?
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!