Pakistan: రష్యా, చైనా శరణు కోరుతున్న పాకిస్తాన్..
- దౌత్యపరమైన ఒత్తిడిలో పాకిస్తాన్..
- రష్యా, చైనా శరణు కోరుతున్న దాయాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడం పాకిస్తాన్ని కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు, భారత్ సైనిక చర్యకు దిగవచ్చనే భయం ఆ దేశంలో ఉంది. బయటకు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ పాక్ ఆర్థిక పరిస్థితి, అంతర్గత సమస్యలు, ఆర్మీలో గ్రూపులు అన్ని కూడా ఆ దేశానికి ప్రతీకూలంగానే ఉన్నాయి.
Read Also: Mani Shankar Aiyar: ‘‘పాకిస్తాన్పై కాంగ్రెస్ ప్రేమ’’.. మణిశంకర్ అయ్యర్ కామెంట్స్పై బీజేపీ..
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
మంగళవారం జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. పాకిస్తాన్కు చెందిన నిషేధిత గ్రూప్ లష్కరే తోయిబా (LeT) ప్రతినిధి అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. అయితే, పాకిస్తాన్ ఘర్షణను తగ్గించేందుకు రష్యా, చైనా సాయం కోరుతున్నట్లు తెలుస్తోంది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ రష్యా మీడియా ఆర్ఐఏ నోవోస్టికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనాలు ఈ సమయంలో సానుకూల పాత్ర పోషించగలవని ఆయన చెప్పారు. భారత్ దేశం, మోడీ అబద్ధం చెబుతున్నారా..? లేదా నిజం చెబుతున్నారా.? అని నిర్ధారించడానికి వారు అంతర్జాతీయ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయవచ్చని అన్నారు. అంతకుముందు పాకిస్తాన్ ప్రధాని కూడా అంతర్జాతీయ దర్యాప్తుకు పిలుపునిచ్చారు.
“భారతదేశంలో, కాశ్మీర్లో జరిగిన ఈ సంఘటనకు దోషిని మనం గుర్తించాలి. ఖాళీ ప్రకటనలకు ఎటువంటి ప్రభావం ఉండదు, పాకిస్తాన్ ప్రమేయం ఉందా అనేదానిపై ఆధారాలు ఉండాలి. ఇవి కేవలం ఆధారం లేని ప్రకటనలు” అని అన్నారు. దీనికి ముందు, పహల్గామ్ దాడిని స్వాతంత్ర్య యోధులు చేశారని పాక్ ఉపప్రధాని ఇషాక్ దార్ అన్నారు.
తాజావార్తలు
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!