Pakistan: రష్యా, చైనా శరణు కోరుతున్న పాకిస్తాన్..
- దౌత్యపరమైన ఒత్తిడిలో పాకిస్తాన్..
- రష్యా, చైనా శరణు కోరుతున్న దాయాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడం పాకిస్తాన్ని కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు, భారత్ సైనిక చర్యకు దిగవచ్చనే భయం ఆ దేశంలో ఉంది. బయటకు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ పాక్ ఆర్థిక పరిస్థితి, అంతర్గత సమస్యలు, ఆర్మీలో గ్రూపులు అన్ని కూడా ఆ దేశానికి ప్రతీకూలంగానే ఉన్నాయి.
Read Also: Mani Shankar Aiyar: ‘‘పాకిస్తాన్పై కాంగ్రెస్ ప్రేమ’’.. మణిశంకర్ అయ్యర్ కామెంట్స్పై బీజేపీ..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
మంగళవారం జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. పాకిస్తాన్కు చెందిన నిషేధిత గ్రూప్ లష్కరే తోయిబా (LeT) ప్రతినిధి అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. అయితే, పాకిస్తాన్ ఘర్షణను తగ్గించేందుకు రష్యా, చైనా సాయం కోరుతున్నట్లు తెలుస్తోంది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ రష్యా మీడియా ఆర్ఐఏ నోవోస్టికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనాలు ఈ సమయంలో సానుకూల పాత్ర పోషించగలవని ఆయన చెప్పారు. భారత్ దేశం, మోడీ అబద్ధం చెబుతున్నారా..? లేదా నిజం చెబుతున్నారా.? అని నిర్ధారించడానికి వారు అంతర్జాతీయ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయవచ్చని అన్నారు. అంతకుముందు పాకిస్తాన్ ప్రధాని కూడా అంతర్జాతీయ దర్యాప్తుకు పిలుపునిచ్చారు.
“భారతదేశంలో, కాశ్మీర్లో జరిగిన ఈ సంఘటనకు దోషిని మనం గుర్తించాలి. ఖాళీ ప్రకటనలకు ఎటువంటి ప్రభావం ఉండదు, పాకిస్తాన్ ప్రమేయం ఉందా అనేదానిపై ఆధారాలు ఉండాలి. ఇవి కేవలం ఆధారం లేని ప్రకటనలు” అని అన్నారు. దీనికి ముందు, పహల్గామ్ దాడిని స్వాతంత్ర్య యోధులు చేశారని పాక్ ఉపప్రధాని ఇషాక్ దార్ అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!