Malaysia: భారత్ దౌత్య బృందాన్ని అడ్డుకునేందుకు పాక్ కుట్ర.. తిప్పికొట్టిన మలేషియా
- భారత్ దౌత్య బృందాన్ని అడ్డుకునేందుకు పాక్ కుట్ర
- తిప్పికొట్టిన మలేషియా ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారతదేశానికి చెందిన ఏడు దౌత్య బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తున్నాయి. దాయాది దేశం యొక్క ఉగ్రవాద వైఖరిని ప్రపంచ నేతలకు వివరిస్తున్నాయి. అయితే జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. అపరాజిత సారంగి, బ్రిజ్లాల్, ప్రధాన్ బారువా, హేమంగ్ జోషి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, సీపీఐ నేత జాన్ బ్రిట్టాస్, మాజీ రాయబారి మోహన్ కుమార్ మలేషయాలో పర్యటించడానికి సిద్ధపడుతుండగా పాకిస్థాన్ అడ్డుకునే ప్రయత్నం చేసింది.
ఇది కూడా చదవండి: Virat Kohli: ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండాలనుకోను.. ఇక ఎక్కువ రోజులు ఆడలేను!
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
‘‘మనది ఇస్లామిక్ దేశం.. మీరు ఇస్లామిక్ దేశం… భారత ప్రతినిధి బృందం మాట వినకండి. మలేషియాలో వారి కార్యక్రమాలను రద్దు చేసుకోండి.’’ అని మలేషియాను పాకిస్తాన్ రాయబార కార్యాలయం కోరింది. కానీ అందుకు మలేషియా ప్రభుత్వం తిరస్కరించింది. పాకిస్థాన్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. దీంతో దాయాది దేశానికి చెంపదెబ్బ కొట్టినట్లైంది. భారత దౌత్య బృందానికి పూర్తి మద్దతు లభించింది. అన్ని కార్యక్రమాలను భారత బృందం యథావిధిగా కొనసాగించింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu : అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు…
ఈ బృందం అప్పటికే జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, ఇండోనేషియాలో పర్యటించింది. చివరి పర్యటన మలేషియానే. శనివారమే మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకుంది. ఇంతలోనే పాకిస్థాన్ కుట్ర పన్నింది. భారతదేశం పంపించిన ఉద్దేశాలను ఆయా దేశాధినేతలకు వివరించినట్లు దౌత్య బృందం తెలిపింది. ప్రపంచ దేశాలన్ని ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాయని చెప్పుకొచ్చారు.
ఇక ఆయా దేశాలకు వెళ్లిన దౌత్య బృందాలతో తిరిగి వచ్చాక ప్రధాని మోడీ అఖిలపక్ష ప్రతినిధుల బృందాన్ని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం జూన్ 9 లేదా 10న జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టేందుకు అన్ని పార్టీలతో కూడిన దౌత్య బృందాలను విదేశాలకు పంపించింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!