tack in Hyderabad: హైదరాబాద్లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్లాన్.. ఎన్ఐఏ రిపోర్టులో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan planned terror attacks in Hyderabad: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలతో ఉగ్రదాడికి పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు ఎన్ఐఏ హెచ్చరించింది.
Read Also: Madhya Pradesh: లవ్ ఫెయిల్యూర్.. మత్తుమందు ఇంజెక్షన్ తీసుకుని నర్స్ ఆత్మహత్య..
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్ లో బహిరంగ సభలు, ఊరేగింపులపై హ్యాండ్ గ్రెనెడ్స్ విసరాలని పాకిస్తాన్ సూచించినట్లు ముగ్గురు వ్యక్తులపై ఎన్ఐఏ దాఖలు చేసి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పాకిస్తాన్ తన సానుభూతిపరులకు హ్యాండ్ గ్రెనేడ్స్ పంపి హైదరాబాద్ నగరంతో ‘‘లోన్ ఊల్ఫ్’’ అటాక్స్ చేయాలని కుట్ర పన్నింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) హైదరాబాద్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. జనవరి 25న ముగ్గురు హైదరాబాద్ వాసులపై ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిందితులు మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు బహిరంగ సభలు, ఊరేగింపులపై హ్యాండ్ గ్రెనేడ్లు విసరాలని పాకిస్తాన్ ఆదేశించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
ఐఎస్ఐ, లష్కరేతోయిబా ఆదేశాలపై అబ్దుల్ జాహెద్ అలియాస్ మహ్మద్ నగరంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు యువకులను రిక్రూట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇతరు గతంలో పలు ఉగ్రవాద కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అక్టోబరు 2022లో హైదరాబాద్లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నినందుకు మాజ్ హసన్ ఫరూక్, సమీయుద్దీన్లపై కూడా ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ ముగ్గురిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద అభియోగాలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పోలీసులు అక్టోబర్ 1, 2022 న జాహెద్ ఇంట్లో రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు మొబైల్స్ ,రూ. 3,31,800 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఇందులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు ఉండటంతో హో మంత్రిత్వ శాఖ ‘ కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ రాడికలైజేషన్’ విభాగం ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!