tack in Hyderabad: హైదరాబాద్లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్లాన్.. ఎన్ఐఏ రిపోర్టులో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan planned terror attacks in Hyderabad: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలతో ఉగ్రదాడికి పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు ఎన్ఐఏ హెచ్చరించింది.
Read Also: Madhya Pradesh: లవ్ ఫెయిల్యూర్.. మత్తుమందు ఇంజెక్షన్ తీసుకుని నర్స్ ఆత్మహత్య..
Also Read
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
హైదరాబాద్ లో బహిరంగ సభలు, ఊరేగింపులపై హ్యాండ్ గ్రెనెడ్స్ విసరాలని పాకిస్తాన్ సూచించినట్లు ముగ్గురు వ్యక్తులపై ఎన్ఐఏ దాఖలు చేసి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పాకిస్తాన్ తన సానుభూతిపరులకు హ్యాండ్ గ్రెనేడ్స్ పంపి హైదరాబాద్ నగరంతో ‘‘లోన్ ఊల్ఫ్’’ అటాక్స్ చేయాలని కుట్ర పన్నింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) హైదరాబాద్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. జనవరి 25న ముగ్గురు హైదరాబాద్ వాసులపై ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిందితులు మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు బహిరంగ సభలు, ఊరేగింపులపై హ్యాండ్ గ్రెనేడ్లు విసరాలని పాకిస్తాన్ ఆదేశించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
ఐఎస్ఐ, లష్కరేతోయిబా ఆదేశాలపై అబ్దుల్ జాహెద్ అలియాస్ మహ్మద్ నగరంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు యువకులను రిక్రూట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇతరు గతంలో పలు ఉగ్రవాద కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అక్టోబరు 2022లో హైదరాబాద్లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నినందుకు మాజ్ హసన్ ఫరూక్, సమీయుద్దీన్లపై కూడా ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ ముగ్గురిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద అభియోగాలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పోలీసులు అక్టోబర్ 1, 2022 న జాహెద్ ఇంట్లో రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు మొబైల్స్ ,రూ. 3,31,800 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఇందులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు ఉండటంతో హో మంత్రిత్వ శాఖ ‘ కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ రాడికలైజేషన్’ విభాగం ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది.
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!