Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
- భారత బిల్లులపై పాకిస్తాన్ అభ్యంతరం..
- డీలిమిటేషన్ బిల్లుపై వ్యాఖ్యలు..
- పీఓకేలో ఏ మార్పునైనా ఒప్పుకోబోమన్న దాయాది..
- పీఓకే కూడా మాదే అని భారత్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లు, లోక్ సభ ఎంపీ స్థానాల డిలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ ముందుంచింది. అయితే, ఈ బిల్లులపై కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎంపీ స్థానాల పెంపు బీజేపీకి సహకరిస్తుందని, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తుందని ఆరోపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ బిల్లుపై దాయాది పాకిస్తాన్ కూడా తీవ్ర అభ్యతరం చెబుతోంది. జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) కూడా అంతర్భాగంగా ఉంది. ఇప్పుడు దీనిపైనే పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్ డీలిమిటేషన్ ప్రక్రియను ‘‘వివాదాస్పద భూభాగంలో చట్టవిరుద్ధమైన రాజకీయ ఆర్భాటం’’గా అభివర్ణిస్తూ తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబి తిరస్కరించారు. జమ్మూ కాశ్మీర్ భూభాగంలోని ఏ భాగాన్నైనా పునర్ నిర్వచించే చట్టపరమైన అధికారం భారత్కు లేదని ఆయన అన్నారు.
Also Read
- Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
- Trinamool congress: బెంగాల్లో టీఎంసీ పతనానికి నాంది.. బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?
- Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం
- Terror Plot: ఢిల్లీ, పంజాబ్లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
అయితే, దీనిపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. పీఓకే కూడా భారత్లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ‘‘నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి, భారతదేశ అంతర్గత వ్యవహారం. వాటిలో జోక్యం చేసుకోవడానికి లేదా వాటిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి చేసే ప్రయత్నాలను మేము తిరస్కరిస్తున్నాము’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
పరిస్థితులు అనుకూలించినప్పుడు, భారత ఎన్నికల సంఘం (ECI) PoKకి పునర్విభజన కమిషన్గా వ్యవహరిస్తుందని పునర్విభజన బిల్లు 2026 ప్రతిపాదిస్తుంది. ప్రస్తుతం, జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ఈ భూభాగాల కోసం 24 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి, కానీ ఎన్నికల ద్వారా అవి ఎప్పుడూ భర్తీ చేయబడలేదు. 1947లో అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఆ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేస్తూ సంతకం చేశారు. పాక్, ఆక్రమిత కాశ్మీర్ను ఖాళీ చేయాలని 1994లో భారత పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!