Pahalgam Terror Attack: భారత్ దెబ్బకి భయపడిన పాక్.. ఉగ్రవాదుల తరలింపు..
- భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
- పీవోకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేస్తున్న పాకిస్తాన్ సైన్యం..
- ఉగ్రవాదులను షెల్టర్లు, బంకర్లకు తరలిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడితో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాయాది దేశానికి భారత్ తగిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో పీవోకేలో గల ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తుంది. వారిని ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించినట్లు సమాచారం. భారత భద్రతా దళాలు క్రియాశీలకంగా ఉన్న పలు లాంచ్ ప్యాడ్లను గుర్తించడంతో పాక్ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Read Also: Ready to War: యుద్ధానికి సిద్ధమా..? ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేవా..?
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
అయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని పచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా, కేల్, సర్ది, దుధ్నియల్, అత్ముఖం, జురా, లిపా, కొట్లి లాంటి పలు ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను తరలిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు కాశ్మీర్లోకి చొరబడటానికి ముందు వారు నివసించే కీలక కేంద్రాలుగా ఈ లాంచ్ ప్యాడ్స్ పని చేస్తాయని పేర్కొన్నారు. వీటిలో 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన టెర్రరిస్టులు ఉన్నారని, వారంతా చొరబాటుకు రెడీగా ఉన్నారని వెల్లడించారు.
Read Also: Pahalgam Terror Attack: రోడ్లపై పాకిస్థాన్ జెండాలు అతికించిన వ్యక్తులు.. పోలీసులు ఏం చేశారంటే?
ఇక, పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టులపై ఉగ్ర దాడిలో26 మంది చనిపోయారు. ఈ సంఘటనతో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్తో దౌత్య సంబంధాలను ఇప్పటికే భారత్ రద్దు చేసుకుంది. అలాగే, సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు దాయాది దేశానికి చెందిన పౌరులు తక్షణమే భారత్ వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. మరోవైపు, సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన బెడుతున్నట్లు పాక్ ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ క్షణమైన యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!