Pakistan: భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. మరోసారి పాక్ ఆరోపణలు..
- భారత్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది..
- బలూచిస్తాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోంది..
- మరోసారి భారత్పై పాకిస్తాన్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ వరసగా దాడులకు గురవుతోంది. ముఖ్యంగా బలూచిస్తాన్లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ పాక్ ఆర్మీపై దాడులు చేస్తోంది. బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతోంది. కొన్ని రోజుల క్రితం, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసి, 200 మందికి పైగా పాక్ ఆర్మీ, ఐఎస్ఐ సిబ్బందిని హతం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పాక్ భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా బీఎల్ఏ విరుచుకుపడింది. ఈ ఘటనలో 90 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అటు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పాక్ తాలిబన్లు తీవ్రంగా దాడులు చేస్తున్నారు.
Read Also: Disha Salian: దిశా సాలియన్ ఎవరు..? హత్యతో సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఆదిత్య ఠాక్రేకు సంబంధం ఏమిటి..?
Also Read
ఈ నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ ప్రేమయం ఉందని ఆరోపణలు చేస్తోంది. పాకిస్తాన్లో భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, తమ దేశాన్ని అస్థిర పరచడానికి ప్రయత్నిస్తోంది అక్కడి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ‘‘ఇది చాలా స్పష్టంగా ఉంది. భారత్ తమ దేశంలో హత్యలను స్పాన్సర్ చేస్తోంది’’ అని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ అన్నారు. “భారత ప్రమేయం స్పష్టంగా ఉంది. వారు పాకిస్తాన్లో ఉగ్రవాదంలో పాలుపంచుకున్నారు. రెండవది, ఇది కేవలం పాకిస్తాన్ను మాత్రమే కాదు, వారు మొత్తం ప్రాంతాన్ని, అన్ని దక్షిణాసియా దేశాలను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆరోపించాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడంలో,బలూచిస్తాన్ను అస్థిరపరచడంలో భారత ప్రేమేయం ఉందని మాకు తెలుసు అని అన్నారు.
మరోసారి పాక్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ శాంతియుత సహజీవనాన్ని విశ్వసిస్తుందని విదేశాంగ కార్యాలయ ప్రతినిధి అన్నారు. దక్షిణాసియాలో శాశ్వత శాంతికి, సంబంధిత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు మరియు కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జమ్మూ కాశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారం చాలా అవసరం అని అన్నారు. జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటనను భారత్ ఎందుకు ఖండించలేదని షఫ్కత్ అలీ ఖాన్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!