IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన.. పాక్కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పే లేదు..
- ప్రమాదకర వాతావరణంలో చిక్కుకున్న ఇండిగో ఫ్లైట్..
- ఎయిర్స్పేస్ ఇవ్వడానికి నిరాకరించిన పాకిస్తాన్..
- పాక్కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పు లేదంటున్న నెటిజన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బలమైన వడగళ్ల వానను తట్టుకుని పైలట్ విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్లో ల్యాండ్ చేశారు. ఢిల్లీ నుంచి 220 మంది ప్రయాణికులతో శ్రీనగర్ వెళ్తున్న విమానం బలమైన టర్బులెన్స్కి గురైంది. బుధవారం, ఇండిగో A321 నియో విమానం 6E 2142 పఠాన్కోట్ సమీపంలో వడగళ్ల తుఫాను,తీవ్రమైన టర్బులెన్స్ని ఎదుర్కొంది.
అయితే, ప్రమాదకర పరిస్థితుల్లో వడగళ్ల వానను తప్పించుకునేందు, అంతర్జాతీయ సరిహద్దు దాటి, పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లేందుకు లాహోర్ ఏటీసీని అనుమతి ఇవ్వాలని పైలట్ అభ్యర్థించినా, పాకిస్తాన్ ఇందుకు ఒప్పుకోలేదని ఏవియేషన్ వాచ్డాగ్ DGCA శుక్రవారం తెలిపింది. ఈ ఘటన తర్వాత, విమానాన్ని పైలట్ సురక్షితంగా శ్రీనగర్ చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ముక్కు భాగం తీవ్రంగా దెబ్బతింది. దీనిని బట్టి చూస్తే విమానం ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొంది అనేది స్పష్టంగా తెలుస్తోంది.
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
Read Also: Cyber Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో.. న్యాయవాది నుంచి రూ. 19 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
ప్రస్తుతం, ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని తెలిపింది. అయితే, ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా, పాకిస్తాన్ మానవతా దృక్పథంతో స్పందించలేదని నెటిజన్లు తిడుతున్నారు. పాకిస్తాన్ని భారత్ సింధు జలాలను ఆపడంలో తప్పు లేదని పోస్టులు పెడుతున్నారు.
ఇటీవల, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. పాకిస్తాన్ 80 శాతం వ్యవసాయం ఈ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఉగ్రవాద దాడి తర్వాత చీనాబ్ నది నీటిని భారత్ అడ్డుకుంది.
#Pakistan once again showed it's real face.
Lahore ATC denied passage to Indigo Flight which was carrying 200 Passengers.
Bad weather & Turbulence put lives on threat.Well u can not expect more from a #TerrorState.#IndiGoFlight #PlaneCrash #Bitcoin #GTvLSG #viralvideo pic.twitter.com/6NtkJAlghO
— Sunaina Bhola (@sunaina_bhola) May 23, 2025
తాజావార్తలు
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!