IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన.. పాక్కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పే లేదు..
- ప్రమాదకర వాతావరణంలో చిక్కుకున్న ఇండిగో ఫ్లైట్..
- ఎయిర్స్పేస్ ఇవ్వడానికి నిరాకరించిన పాకిస్తాన్..
- పాక్కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పు లేదంటున్న నెటిజన్లు..
IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బలమైన వడగళ్ల వానను తట్టుకుని పైలట్ విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్లో ల్యాండ్ చేశారు. ఢిల్లీ నుంచి 220 మంది ప్రయాణికులతో శ్రీనగర్ వెళ్తున్న విమానం బలమైన టర్బులెన్స్కి గురైంది. బుధవారం, ఇండిగో A321 నియో విమానం 6E 2142 పఠాన్కోట్ సమీపంలో వడగళ్ల తుఫాను,తీవ్రమైన టర్బులెన్స్ని ఎదుర్కొంది.
అయితే, ప్రమాదకర పరిస్థితుల్లో వడగళ్ల వానను తప్పించుకునేందు, అంతర్జాతీయ సరిహద్దు దాటి, పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లేందుకు లాహోర్ ఏటీసీని అనుమతి ఇవ్వాలని పైలట్ అభ్యర్థించినా, పాకిస్తాన్ ఇందుకు ఒప్పుకోలేదని ఏవియేషన్ వాచ్డాగ్ DGCA శుక్రవారం తెలిపింది. ఈ ఘటన తర్వాత, విమానాన్ని పైలట్ సురక్షితంగా శ్రీనగర్ చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ముక్కు భాగం తీవ్రంగా దెబ్బతింది. దీనిని బట్టి చూస్తే విమానం ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొంది అనేది స్పష్టంగా తెలుస్తోంది.
Also Read
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
Read Also: Cyber Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో.. న్యాయవాది నుంచి రూ. 19 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
ప్రస్తుతం, ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని తెలిపింది. అయితే, ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా, పాకిస్తాన్ మానవతా దృక్పథంతో స్పందించలేదని నెటిజన్లు తిడుతున్నారు. పాకిస్తాన్ని భారత్ సింధు జలాలను ఆపడంలో తప్పు లేదని పోస్టులు పెడుతున్నారు.
ఇటీవల, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. పాకిస్తాన్ 80 శాతం వ్యవసాయం ఈ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఉగ్రవాద దాడి తర్వాత చీనాబ్ నది నీటిని భారత్ అడ్డుకుంది.
#Pakistan once again showed it's real face.
Lahore ATC denied passage to Indigo Flight which was carrying 200 Passengers.
Bad weather & Turbulence put lives on threat.Well u can not expect more from a #TerrorState.#IndiGoFlight #PlaneCrash #Bitcoin #GTvLSG #viralvideo pic.twitter.com/6NtkJAlghO
— Sunaina Bhola (@sunaina_bhola) May 23, 2025
తాజావార్తలు
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
-
IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
-
Geetha MAdhuri : నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు.. కాపురాలు కూలిపోవడం ఖాయం..
-
Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?