Pahalgam terror attack: ‘‘హిందువునని గర్వంగా ప్రాణత్యాగం చేశాడు’’.. నా భర్తకు అమరవీరుడి హోదా ఇవ్వండి..
- ‘‘ హిందువని గర్వంగా ప్రాణత్యాగం చేశారు’’..
- నా భర్తకు ‘‘అమరవీరుడి’’హోడా ఇవ్వాలి..
- శుభం ద్వివేది భార్య అశాన్య డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి బాధితుల్ని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. అప్పటి వరకు ప్రకృతిని, కాశ్మీర్ అందాలను చూస్తూ సంతోషంగా ఉన్న వారిని టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. క్షణాల్లో వారి ఆనందాన్ని విషాదంగా మార్చారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడికి తెగబడ్డారు. లష్కరే తోయిబా అనుబంధ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఉగ్రసంస్థ జరిపిన దాడిలో 26 మంది మరణించారు.
పహల్గామ్ దాడి బాధితుడు శుభం ద్వివేది భార్య అశాన్య ద్వివేది తన భర్తకు ‘‘అమరవీరుడి’’ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ద్వివేది తనను తానున హిందువుగా గర్వంగా ప్రాణ త్యాగం చేసి ఇతరుల్ని రక్షించారని ఆమె అన్నారు. మొదటి బుల్లెట్ తన భర్తకు తగిలిందని, ఉగ్రవాదులు హిందువులు, ముస్లింలా అని అడగటానికి సమయం తీసుకున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పరిగెత్తి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సమయం ఉందని అని అశాన్య శనివారం తెలిపారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Terror attack: కెనడాలో జనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఉగ్రదాడిగా అనుమానం..
పహల్గామ్ పచ్చిక మైదానాలను చూస్తున్న సమయంలో ఉగ్రవాదులు అమాయకపు టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. వీరిలో శుభం ద్వివేది కూడా ఉన్నారు. శుభం, అశాన్యకు ఫిబ్రవరి 12న వివాహం జరిగింది. ఇంతలోనే ఉగ్రదాడిలో శుభం మరణించారు. ఆయన అంత్యక్రియాలు స్వగ్రామంలో గురువారం జరిగాయి. ప్రభుత్వం తన డిమాండ్ని అంగీకరిస్తే తాను జీవించడానికి ఒక కారణం ఉంటుందని అశాన్య చెప్పింది.
ఉగ్రవాదులు శుభంని హిందువా..? ముస్లిమా..? అని అడిగిన సమయంలో ఫ్రాంక్ చేస్తున్నారని తాను భావించినట్లు అశాన్య చెప్పింది. “వారు వచ్చిన వెంటనే, వారిలో ఒకరు మేము హిందువులమా లేక ముస్లింలమా అని అడిగారు? ఆ వ్యక్తులు (ఉగ్రవాదులు) ఫ్రాంక్ చేస్తున్నారని నేను అనుకున్నాను. నేను వెనక్కి తిరిగి, నవ్వి, ఏమి జరుగుతుందో అడిగాను. అప్పుడు వారు తమ ప్రశ్నను మళ్లీ అడిగారు. మేము హిందువులమని నేను సమాధానం ఇచ్చిన వెంటనే, కాల్పులు జరిగాయి . శుభమ్ ముఖం రక్తంతో కప్పబడి ఉంది. ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు” అని ఆమె చెప్పింది. తనను కాల్చి చంపాలని ఉగ్రవాదుల్ని వేడుకున్నానని, కానీ అందుకు వారు నిరాకరించి, మీ ప్రభుత్వానికి తాము ఏం చేశామో చెప్పేందుకు బతికే ఉండాలని చెప్పారని అశాన్య చెప్పింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!