Pahalgam Terror Attack: శ్రీనగర్కు బయలుదేరిన హోంమంత్రి అమిత్ షా..
- జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రదాడి..
- ప్రధాని మోడీ ఆదేశాలతో శ్రీనగర్ కు కేంద్ర హోంశాఖ మంత్రి..
- ఈ ఘటనపై భద్రతా దళాలతో అమిత్ షా అత్యవసర సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్ర దాడి జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే చాలా మంది పర్యాటకులు మరణించినట్లు తెలుస్తుంది. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆరా తీసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కాల్ చేసి శ్రీనగర్ వెళ్లాలని సూచించారు. దీంతో హుటాహుటిన ఆయన శ్రీనగర్ కు బయలుదేరి వెళ్తున్నారు. కాగా, శ్రీనగర్ వెళ్లిన తర్వాత అన్ని ఏజెన్సీలతో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అమిత్ షా. కాగా, అంతకుముందు, పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ఈ దారుణమైన ఉగ్రవాద చర్యలో పాల్గొన్న వారిని వదిలిపెట్టబోము హెచ్చరించారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
Read Also: Fan Wars: ఫ్యాన్ వార్స్ కి టైం అయింది.. ఆఖరికి ఇలా కూడానా?
Also Read
అయితే, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఖండించారు. ఈ వార్త విని తీవ్ర మనో వేదనకు గురయ్యాను.. అమాయక పౌరులపై దాడికి పాల్పడిన వారిని వదిలి పెట్టమని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలి అని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం అచంచలమైనది.. అది మరింత బలపడుతుంది అని ఆయన వెల్లడించారు.
Anguished by the terror attack on tourists in Pahalgam, Jammu and Kashmir. My thoughts are with the family members of the deceased. Those involved in this dastardly act of terror will not be spared, and we will come down heavily on the perpetrators with the harshest consequences.…
— Amit Shah (@AmitShah) April 22, 2025
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!