Padma Awards: ధర్మేంద్రకు పద్మ విభూషణ్, మమ్ముట్టికి పద్మ భూషన్..
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం..
- మొత్తం 131మందికి అవార్డులు..
- ధర్మేంద్రకు పద్మ విభూషణ్, మమ్ముట్టికి పద్మ భూషణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padma Awards: కేంద్రం ఆదివారం 2026 ఏడాదికి గానూ పద్మ అవార్డుల్ని ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ విభాగాలకు సంబంధించి 131 మందికి అవార్డులు ప్రకటించింది. ఈ జాబితాలో ప్రజా జీవితం, కళలు, సినిమా, సాహిత్యం, క్రీడలు, ప్రజా వ్యవహారాల నుండి అనేక మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఐదుగురికి భారత్ రెండో అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి. ఈ ఏడాది జాబితాలో 19 మంది మహిళలు, ఆరుగురు విదేశీయులు లేదా విదేశాల్లోని భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు. 16 మందికి మరణానంతరం ఈ గౌరవాలు దక్కాయి.
పద్మ విభూషణ్:
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
పద్మ విభూషన్ వచ్చిన వారిలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్(మరణానంతరం), కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ (మరణానంతరం), క్లాసికల్ వయోలిన్ విద్వాంసుడు ఎన్. రాజం, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కె.టి. థామస్, ప్రముఖ రచయిత పి. నారాయణన్ ఉన్నారు.
పద్మ భూషణ్:
పద్మ భూషన్ జాబితాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, గాయని అల్కా యాగ్నిక్, పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్ సింగ్ కోష్యారి, అడ్వటైజింగ్ వెటరన్ పియూష్ పాండే (మరణానంతరం), సామాజిక నాయకుడు వెల్లపల్లి నటేసన్, టెన్నిస్ ఐకాన్ విజయ్ అమృతరాజ్, వైద్యంలో కల్లిపట్టి రామస్వామి పళనిస్వామికి, ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ నోరి దత్రాత్రేయుడికి, సామాజిక సేవలో ఎస్కేఎం మైలనందన్, కళల్లో శతావధాని ఆర్ గణేష్కు ఇచ్చారు. వీరితో పాటు జార్ఖండ్ మాజీ సీఎం శిబు సొరెన్, వికే మల్హోత్రాలను పద్మ భూషన్తో సత్కరించారు.
పద్మ శ్రీ:
పద్మ శ్రీ వచ్చిన ప్రముఖుల్లో క్రికెటర్ రోహిత్ శర్మ, మహిళా హాకీ క్రీడాకారిణి సవితా పునియా, రెజ్లర్ హర్మన్ప్రీత్ కౌర్ భుల్లార్లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఈ కళా జాబితాలో నటుడు ప్రోసేన్జిత్ ఛటర్జీ, శాస్త్రీయ గాయని త్రిప్తి ముఖర్జీ, తరుణ్ భట్టాచార్య, పోఖిల లెక్తేపి, ఆర్ మాధవన్తో పాటు తెలుగు నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్లను పద్మ శ్రీలతో కేంద్రం సత్కరించింది. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా వీరందరికి అవార్డులు ప్రదానం చేస్తారు.
For the year 2026, the President has approved conferment of 131 Padma Awards including two duo cases (in a duo case, the Award is counted as one) as per list below. The list comprises five Padma Vibhushan, 13 Padma Bhushan and 113 Padma Shri Awards. Nineteen of the awardees are… pic.twitter.com/8DDKIRpPTM
— ANI (@ANI) January 25, 2026
- Tags
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!