Rohini Acharya: గొప్ప వారసత్వాన్ని నాశనం చేయడానికి సొంతోళ్లే చాలు.. లాలూ కుమార్తె కీలక ట్వీట్
- లాలూ కుటుంబంలో విభేదాలు
- ఎన్నికల ఫలితాల తర్వాత రగడ
- తాజాగా లాలూ కుమార్తె ఆసక్తి ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చీలికలు రచ్చకెక్కాయి. విభేదాలు కారణంగా కుటుంబ సభ్యులంతా ఎవరికి వారే వేరైపోయినట్లుగా తెలుస్తోంది. తాజాగా లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆసక్తికర ట్వీట్ చేశారు. గొప్ప వారసత్వాన్ని నాశనం చేయడానికి సొంత మనుషులే చాలు అని వ్యాఖ్యానించారు. అహంకారం, అనాలోచిత సలహా కారణంగా కుటుంబంలో కొంతమంది ఉనికి, గుర్తింపు పోతుందని వాపోయారు. అహంకారం ఆవహించినప్పుడు నిర్ణయాలు నియంత్రిస్తాయని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Trump-Putin: పుతిన్ నా ఫ్రెండ్.. అలా చేయను.. ప్రెస్మీట్లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారో తెలియదు గానీ.. కుటుంబంలో నెలకొన్న రగడ గురించి అని మాత్రం తెలుస్తోంది. అయితే ఈ పోస్ట్ తేజస్వి యాదవ్ను ఉద్దేశించే పెట్టినట్లుగా ఆర్జేడీ శ్రేణులు భావిస్తున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత తేజస్వి యాదవ్పై రోహిణి ఆచార్య అనేక ఆరోపణలు చేశారు. తాజాగా పేరు వెల్లడిపరచకపోయినా.. సోదరుడి గురించేనని అంతా అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగికి షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ
గత నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 243 స్థానాలకు గాను 140 సీట్లలో ఆర్జేడీ పోటీ చేసింది. కానీ కేవలం 25 సీట్లనే గెలుచుకుంది. ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. బీజేపీ 89, జేడీయూ 85 గెలుచుకున్నాయి. మొత్తంగా 202 స్థానాలు సొంతం చేసుకుంది. నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు.

తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!