Asaduddin Owaisi: సంభాల్ మసీదుకు ఎదురుగా పోలీస్ పోస్ట్.. యోగి నిర్ణయంపై ఓవైసీ ఫైర్..
- వివాదాస్పద సంభాల్ మసీదుకు ఎదురుగా పోలీస్ అవుట్ పోస్ట్..
- పోలీస్ అవుట్ పోస్ట్ నిర్మాణంపై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: గత నెలలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్లోని షాహీ జామా మసీదు వివాదంపై హింస చెలరేగింది. కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకి వెళ్లిన అధికారుల బృందంపై ఓ వర్గం రాళ్లుతో దాడి చేసింది. స్థానికంగా ఉన్న ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. రాళ్ల దాడిలో 20కి మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మసీదుకు ఎదురుగా పోలీస్ అవుట్ పోస్ట్ని నిర్మిస్తోంది యోగి ఆదిత్యనాథ్ సర్కార్.
మసీదుకు ఎదురుగా కొత్త పోలీస్ అవుట్ పోస్టు నిర్మించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శనివారం విమర్శించారు. పాఠశాలలు, ఆస్పత్రులకు బదులుగా పోలీస్ పోస్టుటు, మద్యం బార్లను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయని ఓవైసీ విమర్శించారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో అతి తక్కువ సంఖ్యలో ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు డేటా సూచిస్తోందని ఓవైసీ ఎక్స్ వేదికగా చెప్పారు.
Also Read
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
Read Also: AAP Vs LG: ఆప్ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశం
‘‘సంభాల్లోని జామా మసీదు ముందు పోలీసు పోస్ట్ను నిర్మిస్తున్నారు. దేశంలోని ఏ మూలకు వెళ్లినా.. అక్కడి ప్రభుత్వం పాఠశాలలు లేదా ఆసుపత్రులను తెరవడం లేదు. ఏదైనా నిర్మిస్తున్నారంటే అవి పోలీసు పోస్టులు, మద్యం బార్లు. వీటిని ఏర్పాటు చేసేందుకే ప్రభుత్వం వద్ద డబ్బు ఉంది. ముస్లిం ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో ప్రభుత్వ సౌకర్యాలు ఉన్నాయి’’ అని ఆయన పోస్ట్ చేశారు. ‘‘సత్యవ్రత్’’పేరుతో పోలీస్ అవుట్పోస్ట్కి డిసెంబర్ 28 శనివరం భూమి పూజ నిర్వహించారు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం కానుంది.
సంభాల్లోని జామా మసీదుని ప్రాచీన హరిహర్ మందిరాన్ని కూల్చి కట్టారని హిందూ పక్షం కోర్టుని ఆశ్రయించింది. దీంతో నవంబర్ 24న సర్వేకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అధికారులు సర్వేకి వెళ్లిన సమయంలో వేలాదిగా గుంపు అధికారులపై దాడులు చేశారు. ఈ కేసులో సమాజ్వాదీ పార్టీకి చెందిన స్థానిక ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్తో పాటు, ఎమ్మెల్యే కుమారుడిపై అభియోగాలు నమోదయ్యాయి. భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత సెక్షన్ల కింద సంభాల్ హింసాకాండలో ఇప్పటివరకు 50 మందిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!