Asaduddin Owaisi: సంభాల్ మసీదుకు ఎదురుగా పోలీస్ పోస్ట్.. యోగి నిర్ణయంపై ఓవైసీ ఫైర్..
- వివాదాస్పద సంభాల్ మసీదుకు ఎదురుగా పోలీస్ అవుట్ పోస్ట్..
- పోలీస్ అవుట్ పోస్ట్ నిర్మాణంపై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: గత నెలలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్లోని షాహీ జామా మసీదు వివాదంపై హింస చెలరేగింది. కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకి వెళ్లిన అధికారుల బృందంపై ఓ వర్గం రాళ్లుతో దాడి చేసింది. స్థానికంగా ఉన్న ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. రాళ్ల దాడిలో 20కి మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మసీదుకు ఎదురుగా పోలీస్ అవుట్ పోస్ట్ని నిర్మిస్తోంది యోగి ఆదిత్యనాథ్ సర్కార్.
మసీదుకు ఎదురుగా కొత్త పోలీస్ అవుట్ పోస్టు నిర్మించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శనివారం విమర్శించారు. పాఠశాలలు, ఆస్పత్రులకు బదులుగా పోలీస్ పోస్టుటు, మద్యం బార్లను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయని ఓవైసీ విమర్శించారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో అతి తక్కువ సంఖ్యలో ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు డేటా సూచిస్తోందని ఓవైసీ ఎక్స్ వేదికగా చెప్పారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: AAP Vs LG: ఆప్ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశం
‘‘సంభాల్లోని జామా మసీదు ముందు పోలీసు పోస్ట్ను నిర్మిస్తున్నారు. దేశంలోని ఏ మూలకు వెళ్లినా.. అక్కడి ప్రభుత్వం పాఠశాలలు లేదా ఆసుపత్రులను తెరవడం లేదు. ఏదైనా నిర్మిస్తున్నారంటే అవి పోలీసు పోస్టులు, మద్యం బార్లు. వీటిని ఏర్పాటు చేసేందుకే ప్రభుత్వం వద్ద డబ్బు ఉంది. ముస్లిం ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో ప్రభుత్వ సౌకర్యాలు ఉన్నాయి’’ అని ఆయన పోస్ట్ చేశారు. ‘‘సత్యవ్రత్’’పేరుతో పోలీస్ అవుట్పోస్ట్కి డిసెంబర్ 28 శనివరం భూమి పూజ నిర్వహించారు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం కానుంది.
సంభాల్లోని జామా మసీదుని ప్రాచీన హరిహర్ మందిరాన్ని కూల్చి కట్టారని హిందూ పక్షం కోర్టుని ఆశ్రయించింది. దీంతో నవంబర్ 24న సర్వేకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అధికారులు సర్వేకి వెళ్లిన సమయంలో వేలాదిగా గుంపు అధికారులపై దాడులు చేశారు. ఈ కేసులో సమాజ్వాదీ పార్టీకి చెందిన స్థానిక ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్తో పాటు, ఎమ్మెల్యే కుమారుడిపై అభియోగాలు నమోదయ్యాయి. భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత సెక్షన్ల కింద సంభాల్ హింసాకాండలో ఇప్పటివరకు 50 మందిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!