McDonald’s: ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేస్తే, చికెన్ బర్గర్కి బిల్లు.. రూ.2 కోట్లు చెల్లించాలని పిటిషన్..
- ఫ్రెంచ్ ఫ్రైస్కి బదులుగా చికెన్ బర్డర్..
- మెక్డొనాల్డ్స్లో బిల్లింగ్ లోపం..
- రూ. 2 కోట్లు పరిహారం చెల్లించాలని కోరిన వ్యక్తి..
- కేసు డిస్మిస్ చేసిన వినియోగదారుల కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
McDonald: ప్రముఖ రెస్టారెంట్ మెక్డొనాల్డ్స్ తనకు రూ. 2 కోట్లు చెల్లించాలని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేస్తే చికెన్ బర్గర్ కోసం బిల్ చేసిన తర్వాత తనకు మానసిక క్షోభ కలిగిందని ఆరోపిస్తూ బెంగళూర్కి చెందిన కస్టమర్ దావా వేశారు. శాఖహారి అయిన వ్యక్తికి చికెన్ బర్గర్ ఇవ్వడంపై ఈ వివాదం నెలకొంది.
33 ఏళ్ల బెంగళూర్లోని ఉల్సూర్ నివాసి, రెస్టారెంట్ బిల్లింగ్ సమయంలో సమస్య ఏర్పడి వేరే ఆర్డర్ అతడికి వెళ్లింది. తాను శాకాహారినని, తాను ఆర్డర్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్కి బదులుగా చికెన్ బర్గర్కి బిల్ చేయడంపై ‘‘మానసిక బాధ’’ అనుభవించానని, తనకు రూ. 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని దావా వేశాడు. లిడో మాల్లోని మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లో ఈ సంఘటన జరిగింది.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Read Also: Minister Uttam Kumar Reddy: పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తాం..
ఫిర్యాదుదారు, అతడి మేనల్లుడు వెజ్ ఐటెమ్ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాడు. అయితే, బిల్లులో పొరపాటున మెక్ఫ్రైడ్ చికెన్ బర్గర్ వచ్చింది. లోపాన్ని గమనించిన తర్వాత కస్టమర్కి రెస్టారెంట్ క్షమాపణలు చెప్పింది. అసౌకర్యానికి పరిహారంగా రూ. 100 అందించారు. దీంతో సంతృప్తి చెందన సదరు వ్యక్తి తనకు మెక్డొనాల్డ్స్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఫిర్యాదుతో పాటు బెంగళూరు అర్బన్ II అదనపు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్లో కేసు నమోదు చేయబడింది.
తన ఫిర్యాదులో ఆ వ్యక్తి రెస్టారెంట్ సర్వీస్ లోపం గురించి ఆరోపించారు. భారీ మొత్తాన్ని పరిహారంగా కోరాడు. మెక్డొనాల్డ్ పొరపాటు అనుకోకుండా జరిగిందని వాదించింది. వెంటనే సరిదిద్దామని, క్షమాపణ, ఆర్డర్ వాపస్ పెట్టామని చెప్పారు. ఇది పనికిమాలిన కేసు అని, పరిహారం పొందేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపించింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత.. కస్టమర్ తన శాకాహార ఆర్డర్ అందుకున్నాడని, బిల్లింగ్ లోపంతో అతడి ఆహారం తారుమారైందని, ఇది అతడి ఆహార ప్రాధాన్యతని దెబ్బతీయలేదని, ఇది సేవాలోపం, చిన్న పొరపాటుగా జరిగిందని, కోట్ల పరిహారం డిమాండ్ చేయడం సమర్థనీయం కాదని తీర్పు చెప్పింది.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..