Maharashtra: హిందీ ‘విధింపు’పై వ్యతిరేకత.. కీలక నిర్ణయం తీసుకున్న మహరాష్ట్ర సర్కార్..
- హిందీ విధింపుపై మహారాష్ట్రలో వ్యతిరేకత..
- త్రిభాషా విధానంపై ప్రభుత్వ తీర్మానాన్ని రద్దు చేసిన సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో ప్రతిపక్షాలు ‘‘హిందీ విధింపు’’ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం త్రిభాషా విధానంపై సవరించిన ప్రభుత్వ తీర్మానాన్ని (GR) రద్దు చేసింది. విధానాన్ని సమీక్షించి, కొత్తగా అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడవ భాషగా ప్రవేశపెట్టాలనే ప్రభుత్వం నిర్ణయంపై శివసేన (యూబీటీ), రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ వంటి పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చింది. రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) ఈ విధానానికి వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహించింది. మరాఠీ మాట్లాడే ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ వ్యతిరేకతను వినిపించాలని విజ్ఞప్తి చేసింది.
Read Also: Air India flight: టోక్యో-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో సమస్య.. కోల్కతాలో ల్యాండింగ్..
Also Read
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
దీంతో రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. త్రిభాషా విధానం, దాని అమలుపై డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని మహా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక తర్వాత త్రిభాషా విధానం అమలు చేయబడుతుందని సీఎం వెల్లడించారు. తమకు మరాఠీ కేంద్ర బిందువు అని జోడించారు.
మహాయుతి ప్రభుత్వం ఏప్రిల్లో GR జారీ చేసిన తర్వాత మరాఠీ మరియు ఇంగ్లీష్-మీడియం పాఠశాలల్లో 1 నుండి 5 తరగతుల వరకు హిందీ తప్పనిసరిగా మూడో భాషగా ఉంటుందని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020ని అమలు చేయాలనే చర్యల్లో భాగంగా హిందీని మూడో భాషగా చేశారు. దీనిపై నిరసన వ్యక్తం అయింది. దీంతో ఫడ్నవీస్ సర్కార్ ఈ ఒత్తిడికి తలొగ్గి హిందీ తప్పనిసరి కాదని, విద్యార్థులు మరే ఇతర ప్రాంతీయ భాషను ఎంచుకోవచ్చని అన్నారు.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!