Maharashtra: హిందీ ‘విధింపు’పై వ్యతిరేకత.. కీలక నిర్ణయం తీసుకున్న మహరాష్ట్ర సర్కార్..
- హిందీ విధింపుపై మహారాష్ట్రలో వ్యతిరేకత..
- త్రిభాషా విధానంపై ప్రభుత్వ తీర్మానాన్ని రద్దు చేసిన సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో ప్రతిపక్షాలు ‘‘హిందీ విధింపు’’ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం త్రిభాషా విధానంపై సవరించిన ప్రభుత్వ తీర్మానాన్ని (GR) రద్దు చేసింది. విధానాన్ని సమీక్షించి, కొత్తగా అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడవ భాషగా ప్రవేశపెట్టాలనే ప్రభుత్వం నిర్ణయంపై శివసేన (యూబీటీ), రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ వంటి పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చింది. రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) ఈ విధానానికి వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహించింది. మరాఠీ మాట్లాడే ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ వ్యతిరేకతను వినిపించాలని విజ్ఞప్తి చేసింది.
Read Also: Air India flight: టోక్యో-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో సమస్య.. కోల్కతాలో ల్యాండింగ్..
Also Read
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
దీంతో రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. త్రిభాషా విధానం, దాని అమలుపై డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని మహా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక తర్వాత త్రిభాషా విధానం అమలు చేయబడుతుందని సీఎం వెల్లడించారు. తమకు మరాఠీ కేంద్ర బిందువు అని జోడించారు.
మహాయుతి ప్రభుత్వం ఏప్రిల్లో GR జారీ చేసిన తర్వాత మరాఠీ మరియు ఇంగ్లీష్-మీడియం పాఠశాలల్లో 1 నుండి 5 తరగతుల వరకు హిందీ తప్పనిసరిగా మూడో భాషగా ఉంటుందని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020ని అమలు చేయాలనే చర్యల్లో భాగంగా హిందీని మూడో భాషగా చేశారు. దీనిపై నిరసన వ్యక్తం అయింది. దీంతో ఫడ్నవీస్ సర్కార్ ఈ ఒత్తిడికి తలొగ్గి హిందీ తప్పనిసరి కాదని, విద్యార్థులు మరే ఇతర ప్రాంతీయ భాషను ఎంచుకోవచ్చని అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!