Lok sabha: సీఈసీని తొలగించాలంటూ స్పీకర్కు నోటీసు.. 190 మంది ఎంపీలు సంతకాలు
- దేశ రాజకీయాల్లో మరో సంచలనం
- ఈసీని తొలగించాలంటూ స్పీకర్కు నోటీసు
- 190 మంది ఎంపీలు సంతకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ను (Chief Election Commissioner) పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు అధికారికంగా నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్షం ఇచ్చిన నోటీసుపై 190 మంది ఎంపీలు సంతకం చేశారు. నోటీసును లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిలోనూ సమర్పించారు. ఎన్నికల నిర్వహణలో తటస్థత పాటించలేదని, కొన్ని నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగినట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి
Also Read
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయని, వాటిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. అందువల్ల ఆయన్ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్తో నోటీసు సమర్పించినట్లు వెల్లడించారు.
ఇక ఈ నోటీసుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతను కాపాడే దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ వ్యవహారం ముందుకు ఎలా సాగుతుందో, పార్లమెంట్ లేదా సంబంధిత అధికార సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ పరిణామం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఇక ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఎవరైనా టేబుళ్లపై ఎక్కితే ఇలాంటి చర్యలు తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. సభ లోపల, వెలుపల సభ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
త్వరలో తమిళనాడు, బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇలాంటి తరుణంలో సీఈసీని తొలగించాలని విపక్షం నోటీసు ఇవ్వడంపై తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?